ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, పానీయాలు అనేక సమస్యలకు కారణమవుతాయి. దీని కారణంగా శరీరం తక్కువ ప్రయోజనం పొందుతుంది.. ఇంకా ఎక్కువ హాని కలుగుతుంది. పోషకాల లోపం.. అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఎముకలు బలహీనంగా మారడంతోపాటు నిత్యం నొప్పి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి, ఎముకలకు హాని చేసే ఆహారాలు ఏమిటి..? ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.చాలా మంది శీతల పానీయాలు లేకుండా పార్టీలు చేసుకోవడానికి, చేయడానికి ఇష్టపడరు. వాస్తవానికి శీతల పానీయాలలో సోడా, హానికరమైన రసాయనాలు కలుపుతారు. దీని వల్ల ఎముకలు చాలా దెబ్బతింటాయి. రోజురోజుకు బలహీనపడటం ప్రారంభమవుతుంది. అంతే కాదు మాంసాహారం తినేవారిలో యానిమల్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో క్యాల్షియం లోపిస్తుంది. దీని వల్ల శరీరంలో నొప్పి మొదలవుతుంది.నిద్రను దూరం చేసేందుకు, ఇంకా కాస్త రిలాక్స్ కోసం చాలా మంది టీ, కాఫీలు తాగుతారు.


కానీ ఈ రెండింటిలో ఉన్న కెఫీన్ అనే మూలకం మన శరీరానికి హాని కలిగిస్తుంది. టీ, కాఫీలు ఎంత ఎక్కువగా తాగితే.. అందులో ఉండే కెఫిన్ మన శరీరంలో ఉండే కాల్షియంను అంత మేర తగ్గిస్తూనే ఉంటుంది. దీని వల్ల ఎముకల్లో నొప్పి వస్తుంది. అదేవిధంగా బీడీ-సిగరెట్లు, గుట్కా నమలడం కూడా మానుకోవాలి. పొగాకులో ఉండే నికోటిన్ కూడా కాల్షియం లోపానికి కారణం.చక్కెర, ఉప్పు మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఇవి లేకుండా ఆహారంలో మంచి రుచిని ఆశించలేము. కానీ ఉప్పు ఇంకా పంచదార ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపిస్తుంది. దీని వల్ల ఎముకలు బలహీనంగా మారడం మొదలవుతుంది. వీటితో మీ శరీరం అన్ని రకాలుగా బాధను అనుభవిస్తూనే ఉంటుంది. అందువలన ఖచ్చితంగా ఉప్పు, చక్కెరను పరిమితికి మంచి అస్సలు తినకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించండి. ఎల్లప్పుడూ సంపూర్ణ  ఆరోగ్యంగా జీవించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: