ఇక రక్తహీనత సమస్యను చాలా ఈజీగా నివారించుకోవాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే లడ్డూను మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. ఈ లడ్డును రోజుకు ఒకటి చొప్పున ప్రతిరోజు కనుక తింటే ఖచ్చితంగా కూడా మీరు రక్తహీనత సమస్యకు దూరంగా ఉండొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మీరు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి వాటిని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఇక ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక కప్పు గింజ తొలగించిన ఎండు ఖర్జూరాలు వేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక చివర్లో పదిహేను బాదం పప్పులు, పదిహేను పిస్తా పప్పులు, పదిహేను జీడిపప్పులు ఇంకా అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని పొడిలా గ్రాండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ని ఆన్ చేసి అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న నట్స్ పొడి, కొబ్బరి పొడి ఇంకా అలాగే ఎండు ఖర్జూరం పొడి వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అలాగే బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి.


ఇక ఆ తరువాత అదే పాన్ లో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యిని మీరు వేసుకోవాలి. ఆ నెయ్యి కాస్త హీట్ అవ్వగానే ఒక కప్పు బెల్లం తురుమును కూడా వేసి కరిగించాలి. ఆ బెల్లం కరిగిన వెంటనే వేయించి పెట్టుకున్న పొడులను అందులో వేసి బాగా మిక్స్ చేసి లడ్డూల లాగా చుట్టుకోవాలి. ఈ లడ్డూలను ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇక రోజుకొకటి చొప్పున ఈ లడ్డూలను ప్రతిరోజూ కూడా తీసుకుంటే హిమోగ్లోబిన్ పరిమాణం అనేది ఈజీగా పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య కూడా చాలా ఈజీగా దూరం అవుతుంది.అలాగే రక్తహీనత లక్షణాల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. కాబట్టి రక్తహీనతతో ఇబ్బంది పడేవా తప్పకుండా ఈ లడ్డూను మీ డైట్లో చేర్చుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: