ఇక మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా ఈజీగా కరిగించి బరువు తగ్గేలా  ఓ డ్రింక్ ని తయారు చేసుకోవచ్చు.ఇక ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనం మూడు దాల్చిన చెక్క ముక్కలను, ఒక ఇంచు అల్లం ముక్కను, ఒక నిమ్మకాయను, ఒక టీ స్పూన్ జీలకర్రను ఇంకా అలాగే ఒక గ్లాస్ నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది.ఇక ముందుగా మీరు ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోయాలి.ఆ తరువాత అందులో జీలకర్రను ఇంకా అలాగే దాల్చిన చెక్క ముక్కలను వేసుకోవాలి. ఇంకా అలాగే అల్లాన్ని దంచుకుని వేసుకోవాలి. చివరగా నిమ్మకాయను తీసుకొని దానిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తరువాత ఈ నీటిని కొంచెం వేడి చేయాలి. నిమ్మకాయ ముక్కలు మెత్తగా అయ్యే దాకా ఒక 10 నిమిషాల పాటు ఈ నీటిని మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టుకుని ఒక గ్లాస్ లోకి తీసుకోని ఇలా చేయడం వల్ల బరువును తగ్గించే పానీయం తయారవుతుంది. ఇక ఇప్పుడు ఈ పానీయాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజుకు రెండు పూటలా భోజనానికి గంట ముందు మీరు తీసుకోవాలి. భోజనానికి గంట ముందు తీసుకోవడం కుదరని వారు భోజనం చేసిన రెండు గంటల తరువాత దీనిని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కూడా చాలా ఈజీగా కరిగిపోతుంది.ఇక దీనివల్ల మనం చాలా సులభంగా కూడా బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తీసుకున్న కేవలం 10 రోజుల్లోనే మనం మన శరీరంలో వచ్చే మార్పును ఈజీగా గుర్తించవచ్చు. ఇక మంచి ఫలితాలను పొందాలనుకునే వారు దీనిని నెలరోజుల పాటు తీసుకోవడం చాలా మంచిది.ఈ పానీయాన్నీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు కూడా చాలా ఈజీగా అదుపులో ఉంటాయి. జీర్ణవ్యవస్థ కూడా బాగా మెరుగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు ఇంకా విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ పానీయం తయారీలో ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేవే. ఇంకా అలాగే సహజ సిద్దమైనవి కూడా. కాబట్టి ఈ పానీయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా ఈజీగా బరువు తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: