జులై 18 న ప్రియాంక చోప్రా తన 37 వ పుట్టినరోజును మయామిలో తన భర్త నిక్ జోనాస్ మరియు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంది. పుట్టినరోజు వేడుకలు లో ప్రియాంక ఒక మెరిసే ఎరుపు రంగు దుస్తులు ధరించంది, పడవలో(యాచ్ట్) లో గడపడం , వాటర్ స్పోర్ట్స్ లో ఆనందించడం, సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటివి చాలా ఫొటోలలో వైరల్ అయ్యాయి.
ఆమె భర్త నిక్ జోనాస్ తన స్టార్ భార్య పుట్టినరోజును ప్రత్యేకమైనదిగా గుర్తుండిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎరుపు మరియు బంగారు పుట్టినరోజు కేక్ పార్టీలో హైలైట్ అయ్యింది. ఇది ప్రియాంక మెరిసే దుస్తులకు సరితూగేలా ఉంది. ఈ కేక్ను మయామి లోని 'డిసైన్ డెలికసి కేక్స్' అనే ఒక బేకరీ రూపొందించింది.
మల్టీ-లేయర్డ్ కేక్ను తయారుచేయడానికి , అలంకరించడానికి 24 గంటలు పట్టింది, దీనిలో అందమైన బంగారు తాపడాలు కూడా ఉన్నాయి. నివేదిక ప్రకారం, చాక్లెట్ మరియు వనిల్లా కేక్ ధర 5,000 డాలర్లకు పైగా ఉంది, ఇది మన కరెన్సీలో దగ్గర దగ్గరగా 3,45,000 రూపాయలు .