సన్నగా నాజూకు గా ఉండాలని ఎవరికీ మాత్రం ఉండదు చెప్పండి...? అదీ కాకుండా   అధిక బరువు శరీరానికి ఎప్పటికీ మంచిది కాదు.   మరి బరువు తగ్గాలి అనుకుంటే సరిపోదు...ప్రయత్నించాల్సిందె. 
చాలా మంది ఎలాగైనా  బరువు తగ్గాలనీ... డైటింగ్, ఎక్సర్‌సైజ్ లు అంటూ అన్ని ఒకేసారి చేస్తుంటారు.కానీ ఇలా చేయడం ఎముకలకు ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే... డైటింగ్ వల్ల... శరీరానికి ఇవ్వాల్సిన ఆహారం తగ్గిపోతుంది.


అదే సమయంలో ఎక్సర్‌సైజ్ చేస్తే... శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.  ఫలితంగా... కండరాలతోపాటూ... ఎముకలకు కూడా కావాల్సినంత పోషకాలు అందవు. ఒకే సమయంలో పెద్ద మొత్తంలో పోషకాలు తగ్గిపోతే... ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.   ఐతే... బరువు తగ్గేందుకు కొన్ని ఆరోగ్య పద్ధతులు పాటించాలి.   ఈ విషయంలో  ముఖ్యంగా మహిళలు ఎక్కువ జాగ్రత్త పడాలి. మన ఏజ్ పెరుగుతున్నకొద్దీ సహజంగానే ఎముకల్లో బలం తగ్గిపోతుంది....కాబట్టి బలం పెంచుకోవడానికి పౌష్టికాహారం తీసుకోవాల్సి ఉంటుంది. 


ఆలా కాకుండా ఒకే సారి డైటింగ్, ఎక్సర్‌సైజ్ చేసేవారి ఆరోగ్య పరిస్థితిపై నార్త్ కరొలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ ఒకేసారి చేసేవారిలో... ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో ఫ్యాన్ పెరిగిపోతోంది. సరైన పోషకాలు అందకపోవడంతో ఎముకలు... ఫ్యాట్‌తో నిండిపోవడం వల్ల ఎముకల పటిష్టత దెబ్బ తింటుంది.సాధారణంగా 30 ఏళ్ల వయసుండే మహిళలు... రోజుకు 2,000 కేలరీల శక్తికి సరిపడా ఫుడ్ తినాల్సిందే. 


కానీ డైటింగ్ చేసేవారు... 30 శాతం తక్కువ ఆహారం తీసుకుంటున్నారు.  ఫలితంగా కేలరీల సంఖ్య 1400కి పడిపోతోంది.అందువల్ల  మహిళలు వారానికి 450 గ్రాముల (ఒక పౌండ్) బరువు తగ్గిపోతున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో ఎముకలకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు పరిశోధకులు. అందువల్ల డైటింగ్ చెయ్యడం మానేసి... మంచి ఆహారం తింటూ... ఎక్సర్‌సైజ్ చెయ్యడం మేలంటున్నారు పరిశోధకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: