ఈరోజుల్లో బీపీ, సుగర్, కీళ్ల నొప్పులు వంటి జబ్బులు కామన్ అయ్యాయి. నలభయ్యేళ్లు రాక ముందే చాలామంది వీరి బాటన పడుతున్నారు. ఇక 40 దాటిన వారి సంగతి సరే సరి. ఈ జబ్బుల కోసం తప్పని సరిగా క్రమం తప్పకుండా టాబ్లెట్లు వేసుకోవాల్సిందే. అధిక రక్తపోటు, హృద్రోగం, నొప్పులకు మందులు వాడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


వాటిలో మొదటిది బాగా నీరు తీసుకోవాలి.మంచి నీటిని ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ అంశపై కెనడాకు చెందిన వాటర్లూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల పరిశోధన చేశారు. వేరు వేరు రోగాల కోసం రోజూ మందులు వేసుకునేవారు తగినంత నీరుతాగకపోతే మరికొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తేల్చారు.


రోజూ వేసుకునే టాబ్లెట్ల కారణంగా మూత్ర పిండాలకు హాని ఉందంటున్నారు నిపుణులు. నీటిని అధికంగా తాగడం వల్ల ఈ ప్రమాదం కొంత మేర తగ్గుతుందట. అధిక రక్తపోటు బాధితులకు వాటర్ పిల్, హార్మోనల్ వ్యవస్థను నియంత్రించే ఔషధాలను వైద్యులు సూచిస్తుంటారు.వీటితో పాటు చాలామంది ఆసిన్ మాత్రనూ తీసుకుంటుంటారు. ఈ మూడింటి కారణంగామూత్రపిండాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయట.


దీనికి తోడు శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోతే... ఉన్న నీటితోనే మూత్రం ద్వారా మలినాలను బయటకు పంపేందుకు మూత్రపిండాలు ప్రయత్నిస్తాయి. దీంతో కొత్త సమస్యలు వచ్చి పడతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిత్యం టాబ్లెట్లు వేసుకునేవారు.. అందుకు తగినట్టుగా మంచి నీరు కూడా తాగాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: