కొంతమందికి దరిద్రం ముందు జేబూలో ఉంటే మరికొంత మందికి అప్పుడప్పుడు వెనుక జేబూలో ఉంటుంది. ఇంకొంత మందికి అదృష్టం తలుపు తీసే వరకూ కొడుతూనే ఉంటుంది. వాళ్ళ సుడి అలాంటిది మరి. ఇంతకీ ఈ సుడి గోల ఏంటి అనుకోకండి. సుడిగాళ్ళకే సుడిగాడు గా మారిన ఓ అదృష్టవంతుడి గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. విషయం తెలుసుకున్నాక మాత్రం నిజమే అంటూ నోళ్ళు వెళ్ళ బెట్టక తప్పదు.అసలు విషయం ఏమిటంటే..

 

మధ్యప్రదేశ్ లో అశోక్ నగర్ అనే ప్రాంతంలో ఓ రైల్వే ట్రాక్ ఉంది. అయితే కొంతమంది యువకులు ఆ ట్రాక్ పై పడి ఉన్న వ్యక్తిని చూశారు. ఎంతకీ కదలక పోవడంతో ఈ విషయం పోలీసులకి తెలిపారు. పనులు అన్నీ పక్కన పెట్టి హుటాహుటిన వచ్చిన పోలీసులు తమ కళ్ళ ముందే ఒక రైలు అతడి మీద నుంచీ వెళ్ళడం చూశారు. అప్పటికే మరి రెండు రైళ్ళు అతడి మీద నుంచీ వెళ్ళాయని ఆ యువకులు తెలిపారు.

 

వెంటనే స్పందించిన పోలీసులు రైలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని మరణించిన అతడి శవాన్ని తీయడానికి వెళ్ళారు. చేతులు పట్టుకుని అతడిని బయటకి తీయడానికి ప్రయతిస్తున్న తరుణంలో ఒక్కసారిగా పైకి లేచిన అతడు తండ్రి వచ్చాడు అంటూ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు పరుగు పెట్టారు. పోలీసులు షాక్ నుంచీ తేరుకుని చూడగా అతడు ఫుల్ బాటిల్ తాగిసి పట్టాలపై పడుకున్నాడని అర్థమయ్యింది. దాంతో దగ్గరలోని దవాఖానా కి తీసుకువెళ్ళి చికిత్స జరిపించి అసలు విషయం చెప్పగా అతడు లైట్ తీసుకున్నాడట. ఇది ఫైనల్ ట్విస్ట్ అంటే...చావు చివరి వరకూ వెళ్ళినా మహానుభావుడికి భయం కూడా లేదు అంటూ ఫైర్ అయ్యారట పోలీసులు.


మరింత సమాచారం తెలుసుకోండి: