బిగ్ బాస్ -3 విజేత శ్రీముఖి , రాహుల్ సిప్లిగంజ్ అంటూ సోషల్ మీడియా లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి . శ్రీముఖి విజేత అని , రాహుల్ విజేత అంటూ వెబ్ సైట్లు , యూ ట్యూబ్ ఛానెళ్ల లో వార్తలు హోరెత్తిపోతున్నాయి . ఈ నేపధ్యం లో  బాగ్ బాస్ -3 విజేత పై వెల్లువెత్తుతోన్న ఊహాగానాలపై నాగార్జున ట్విట్టర్ వేదిక స్పందించాడు . బిగ్ బాస్ -3 విజేతకు సంబంధించి వస్తున్న వార్తలను అమ్మకండి అంటూ ట్వీట్ చేశాడు.


 బిగ్ బాస్ సీజన్  -3 చివరి రోజు షూటింగ్ , ఇదొక అద్భుత ప్రయాణం, నాకెంతో సంతోషాన్నిచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున . విజేతకు సంబంధించి సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు నమ్మకండి ...ఈరోజు సాయంత్రం విజేత ఎవరో తెలుస్తుందని అన్నాడు కింగ్ . టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వ్యాఖ్యాత గా జులై లో బుల్లితెర పై  17  మంది కంటెస్టెంట్ తో బిగ్ బాస్ సీజన్ -3  ప్రారంభమయింది . 105 రోజుల పాటు కొనసాగిన ఈ షో నేడు ముగియనుంది . ప్రపంచ అతిపెద్ద రియాల్టీ షో నిర్వాహకులు పేర్కొనే బిగ్ బాస్ ,   టాప్ టిఆర్పి తో రేటింగ్ తో బుల్లి తెర పై దూసుకుపోతోంది .


 బిగ్ బాస్ -3  షో విజేత ఎవరన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది . 17 మంది కంటెస్టెంట్ల లో 11 మంది ఎలిమినేషన్ కాగా , వరుణ్ సందేశ్ , బాబా భాస్కర్ , శ్రీముఖి , అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్ లు ఫైనల్ కు చేరారు . వీరిలో ఈ షో విజేత ఎవరన్నది అధికారికంగా నేత సాయంత్రం తేలనుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: