సాధారణంగా పల్లీలు ఇష్టపడని వారుండరు. పల్లీల్లో బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. శరీరానికి మేలుచేసే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీసు వేరుశెనగల్లో అధికం. అలాగే అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ.
యాంటీఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండే ప్రోటీనలు కణాలు, కణజాల మర్మత్తులు చేసి కొత్త కణాలు ఏర్పడేలా చేస్తుంది. ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా కాపాడుతుంది. వేపుకుని,ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం.
అయితే పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం..కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దూ అని అంటుంటారు. మరి ఎందుకు తాగకూడదు అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది.. పల్లీల్లో
ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. రెండోవది.. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావట.
దీని వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మూడోవది.. పల్లీలు సహజంగానే ఒంట్లో వేడిని కలిగిస్తాయి. అలాంటప్పుడు వీటిని తినగానే నీటిని తాగితే అవి చల్లగా మారతాయి. కాబట్టి లోపల వేడి పదార్థం, చల్లని పదార్థం ఒకదానికొకటి పొసగవు. ఈ క్రమంలో దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు వస్తాయి. కనుక పల్లీలను తినగానే కనీసం ఒక పావు గంట తర్వాత నీళ్లు తాగడం ఉత్తమం.