ముంబై రైల్వే ప్లాట్ ఫాం పై భిక్షాటన చేస్తూ తన గాన మాధుర్యంతో అందరినీ అలరించిన రను మండల్ ...  ఇప్పుడు నెటిజన్ల నుంచి తీవ్ర  విమర్శలు ఎదుర్కొంటోంది.  నిన్న మొన్నటి వరకూ   ఆకాశానికెత్తిన వారే  ఇప్పుడు ఆమె వ్యవహార శైలిపై ఒంటికాలి పై లేస్తున్నారు .  తాజాగా రను మండల్ పీచ్ లెహంగా వేసుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో  అభిమానుల కోసం  షేర్ చేసింది. ఆమె మేకప్ ఓవర్ డోస్ కావడంతో ఆమె రను మండల్ అని గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది.


దీనితో    ఆమెకు అంత  మేకప్ లేకపోతే ఎవరైనా చిన్నబుచ్చుకున్నారా ?  అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.  ఇదొక్కటే కాదు ఇటీవల ఓ అభిమాని రను మండల్ తో కలిసి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయగా, ఆ అభిమానిని దూరం  తోసివేసిన ఘటన కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఒకప్పుడు ముంబై రైల్వే స్టేషన్ లో  బిక్షాటన  చేసుకునే పరిస్థితిని  రను మండల్  మర్చిపోయి, ప్రవర్తిస్తోందని  మండిపడ్డారు.  ఆమె కు సెలబ్రెటీ హోదా కు  తలకెక్కిందని మరికొంతమంది .  విరుచుకుపడ్డారు.


ఇదే కాకుండా  ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో  రను మండల్ దురుసుగా  ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది.  బాలీవుడ్ సంగీత దర్శకుడు ఇమేష్  రేషమ్మియా ద్వారా రను మండల్ ఇండస్ట్రీకి పరిచయం అయింది .  కొన్ని చక్కని పాటలతో అనతికాలంలోనే  సెలబ్రిటీ హోదా సాధించింది . అయితే తన మూలలను విస్మరించి ప్రవర్తించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: