మసాలా దోశ, బిర్యాని మెనూలో లేకపోవడం పై  దేశ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఫైర్ అవుతున్న సంఘటన ఆసక్తిగా మారింది. అసలు ఈ మసాలా, బిర్యాని గొడవ ఏమిటంటే. ఇస్రో ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గురించి అందరికి తెలిసిందే. “గగన్ యాన్” ని ఇస్రో అంతరక్షంలోకి పంపుతోంది. అందుకుగాను అన్నీ సిద్దం చేసింది. అయితే

 

ఈ అంతరక్ష యాత్రకి వెళ్తున్న నలుగురు వ్యోమగాములకి ఎటువంటి ఆహరాన్ని అందివ్వాలి, అక్కడి పరిస్థితులకి తగ్గట్టుగా ఓ ఫుడ్ మెనూ రెడీ చేశారు. ఈ మెనూ లో ఏమి ఉన్నాయనే విషయాన్ని ఇస్రో వెబ్ సైట్ లో పొందుపరిచారు ఇందులో ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్ , ఇడ్లీ, మూంగ్ దాల్ హల్వా, ఉన్నాయి.

 

 

అయితే   ఈ ఫుడ్ మెనూ పై సోషల్ మీడియాలో సెటైర్లు మీద సెటైర్లు పేలుతున్నాయి. కొందరు నెటిజన్లు ఇదంతా బాగానే ఉంది కానీ మరి మసాల దోశ, బిర్యానీ ఏం  పాపం చేశాయి. వాటిని మీరు ఎందుకు పట్టించుకోలేదు అంటూ ఇస్రో కి ట్వీట్ చేశారు. ఇంకొందరు అయితే రసగుల కూడా ఉంటే బాగుండేది, అసలు మీరు పెట్టిన మెనూ చాలా చీప్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: