మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టుగా ఇరాన్ పై ప్రకృతి సైతం కన్నెర్ర చేసింది. ఇప్పటికే అమెరికా దెబ్బకి ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటున్న ఇరాన్ ప్రజలు ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకు రావడంతో ఇక ప్రాణాలపై ఆశలు పూర్తిగా కోల్పోయారని అంటోంది ఇంటర్నేషనల్ మీడియా. ఇరాన్ దక్షిణ, పశ్చిమలోని బుషహార్ లో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 .9 గా నమోదయ్యిందని అధికారులు తెలిపారు. రెండు గటనల సమయంలో సుమారు రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించిందని ప్రకటించారు.
ఒకవైపు అమెరికా వైమానిక దాడులు మరోవైపు ప్రకృతి చేస్తున్న దాడులు చూసిన ప్రపంచ దేశాలు ఇరాన్ పై సానుభూతిని వ్యక్తం చేస్తున్నాయి. ఇలా ఉంటాయి తాజాగా ఈరోజు ఉదయం జరిగిన ఇరాన్ విమాన ప్రమాదంలో దాదాపు 170 మంది ప్రయాణికులు మరణించడం ఇరాన్ ని దేవ దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఒకవేళ చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరగడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ఇలాంటి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఇవాళ జరిగిన భూ ప్రకంపనలు మళ్లీ పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించడంతో ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి.