సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన కేరళాలో చోటు చేసుకుంది. కామంతో కొందరు నీచులు ఎంతకైనా తెగించడానికి సిద్దమయ్యారని చెప్పడానికి తాజాగా జరిగిన ఈ ఘటనే నిదర్సనం. ప్రస్తుత సమాజంలో కొందరు అక్కా , చెల్లి అనే వాయి వరసా లేకుండా ప్రతీ ఒక్కరిపై అత్యాచారాలకి దిగుతున్న ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ నోరు లేని మూగ జీవాలపై అత్యాచారాలు చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయి.

 

కామంతో కళ్ళు మూసుకుపోయిన కొదరు వెధవలు నోరు లేని మూగజీవాలని సైతం  వదలడం లేదు. కేరళాలో జరిగిన ఈ ఘటన అందరిని నోళ్ళు వెళ్ళబెట్టేలా చేసింది. వివరాలలోకి వెళ్తే. కేరళ లోని పాలక్కాడ్ జిల్లా లో ఓ మారు మూల ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తి ఇంట్లో ఓ ఆవుని పెంచుకుంటున్నారు. ఆ ఆవు గడిచిన నాలుగురోజులుగా కనపడటం లేదని వెతుకున్న క్రమంలో

 

ఆ గ్రామ శివారులో ఓ పొదలో ఆవు మృతదేహం కనిపించింది. అది తనదేనని నిర్ధారించుకున్న అతడు ఆవు చనిపోవడానికి కారణం దానిపై లైంఘిక దాడి జరగడమే నని గుర్తించారు. ఆవు మర్మాంగం పై గాయాలు ఉన్నయాని అది అత్యాచారం చేయబడిందని భావించిన అతడు పోలీసులకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పశు వైద్యులు పోస్టుమార్టం నిమిత్తం ఆవుని పరీక్షలు చేస్తున్నారని రిపోర్టులు ఆధారంగా చర్యలు చేపడుతామని స్థానిక పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: