నదిలో నీళ్ళు తాగితే..మనుషులకు అలసట తీరుతుందని అంటారు... ఎప్పుడు పారే నదిలో ఎన్నో సహజ గుణాలున్నాయని వారు అన్నారు..అందుకే ఈ నదుల్లోని నీళ్లను ఎన్నో రకరుగా మందులుగా తయారు చేస్తారు... కొంత మంది నదీ  స్నానం అని తరచూ చేస్తుంటారు..వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి పూర్వీకుల నదీ స్నానాన్ని ఆచరిస్తారు.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ స్నానాన్ని ఆచరిస్తారు..

 

 

అయితే అంతా బాగానే ఉంది కానీ, ఇప్పుడు ఒక విషం అందరినీ కదిలించి వేస్తుంది...ఓ నది వల్ల చాలా మంది నిద్రలోనే మరణించారు..అసలెందుకు ఇలా చనిపోయారు అనే వివరాలను తెలుసుకుందాము..మధ్య ఆఫ్రికాలోని కామెరూన్ ప్రాంతంలో న్యోస్ అనే అందమైన సరస్సు ఉంది. ఉనికిలో లేని అగ్నిపర్వతం ముఖద్వారంలో ఏర్పడిన ఈ సరస్సు ప్రజలను ఆకర్షించింది. దీంతో అంతా ఆ సరస్సు పరిసరాల్లో ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. అక్కడి నీటి వనరులతో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా జీవితాన్ని వెళ్లదీసేవారు.

 

 

చుట్టూ పచ్చదనం, మధ్యలో సరస్సుతో ఆ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. కానీ, అన్ని రోజులు ఒకేలా ఉండవు. జీవితం హాయిగా సాగిపోతుందనే సరికి ఊహించని ముప్పు నిశబ్దంగా దాడి చేసింది. ఆ సరస్సులో నీరు పొంగలేదు.. అగ్నిపర్వతం బద్దలు కాలేదు. కానీ, సగానికి పైగా గ్రామంలో జీవులను మృత్యువు కబళించింది...ఆ నదిలో కొన్ని విషపుటి వాయవులు బయటకు రావడంతో.. అందరూ నిద్రలోనే ప్రాణాలని విడిచారు అని అధ్యయనాలు చెప్తున్నాయి..

 

అలా ఆ భయంకర ప్రమాదంలో బ్రతికిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. ఘాటుగా వాసన రావడంతో..నేను ఒక్కసారిగా సృహ కోల్పోయాను అంటూ ఆయన వెల్లడించారు.. అలా నదిలోని వాయువుల వల్ల ఆ చుట్టు ఉన్న జనం చనిపోయారు..అగ్నిపర్వత వాయువులు నీటి అడుగున సాంద్రీకృతమై ఉంటాయి. అయితే, అవి వాటంతట అవే పైకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. న్యోస్ బిలంలో ఆ రోజు ఏం జరిగిందో తెలీదు. ఆ వాయువులు ఒక్కసారిగా నీటి నుంచి బయటకు విడుదలయ్యాయి. దానివల్లే చనిపోయారని వారు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: