ప్రస్తుత సమాజం ఎటు పోతుందో అర్థం కాని పరిస్థితి. సాధారణంగా గతంలో చుట్టూ నలుగురు ఉన్నప్పుడు స్త్రీ, పురుషుడు పరస్పరం మాట్లాడుకోవాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవారు. రోజులు మారాయి.. మారుతున్న రోజులకనుగుణంగా యువత కూడా మారుతుంది. ఈ క్రమంలోనే ఏకంగా నేటి తరం యువత పబ్లిక్గానే రాసలీలు కొనసాగిస్తున్న పరిస్థితి ఏర్పండింది. ప్రస్తుత యువత ప్రేమకు.. ఆకర్షణకు తేడా తెలియకుండా పోతుంది. చివరికి లేతమనస్సులు ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంతో ప్రాణాలను తీసుకుంటున్నారు.
చిన్న చిన్న వయస్సులోనే ఆకర్షణకులోనై ఎన్నో తప్పులు చేస్తున్నారు. ప్రస్తుత యువత ప్రేమ బస్సులో మొదలై పార్కుల్లో ముగిసిపోతున్నాయి. ఇక తాజాగా సభ్యతను వదిలేసి తాము జనాల మధ్య ఉన్నామన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తించారు ఓ ప్రేమజంట. విశాఖ మీదుగా భువనేశ్వర్ వెళ్తున్న ఇంటర్ సిటీ రైలులో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. చుట్టూ ప్రయాణికులు ఉన్నారన్న విషయాన్ని సైతం మరిచి రాసలీలలు సాగించారు. ఇలాంటి పనులు చేయడం తప్పు అని చెప్పిన వారిపై దాడికి యత్నించారు. ఇదంతా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సమీపంలో జరిగింది.
ఒరిస్సాలోని భువనేశ్వర్కు చెందిన ఓ ప్రేమ జంట ఏకంగా రైలులో తమ ప్రేమలీలలు మొదలెట్టారు. చుట్టూ అందరూ చూస్తున్నారన్న ఇంగితం లేకుండా ఇష్టరీతిన ప్రవర్తించారు. ఇది చూసిన తోటి ప్రయాణికులు తప్పని వారించారు. దీంతో ఆ ప్రేమికుడికి ఎక్కడా లేని కోపం ముంచుకొచ్చింది. అడ్డుచెప్పిన వారిపై దాడికి ప్రయత్నించాడు. ఘటనను చూసిన మిగతా వారు గట్టిగా మందలించి వారిని వదిలిపెట్టారు.