ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మహిళలు సరి కొత్త వంటకాలు తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మగవాళ్ళు కూడా తమ ఇంటి ఆడవాళ్ళ తో రుచికరమైన వంటకాలను తయారు చేయించుకుని తింటున్నారు. సెలబ్రిటీ లు మాత్రం బాగా ఆరోగ్యకరమైన డిషెస్ తయారు చేసేందుకు కిచెన్ లో ప్రయోగాలు చేస్తున్నారు. భరత్ అనే నేను హీరోయిన్ కియారా అద్వానీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో రంగురంగుల ఆహారం పోస్ట్ చేసి పొద్దున్నే పోషకాహారం తీసుకోవాలని తన అభిమానులకు చెప్పకనే చెబుతుంది. ఈ కలర్ ఫుల్ ఆహారంలో కివి, ఆపిల్ పండ్ల ముక్కలు, చియా విత్తనాలు కూడా ఉన్నాయి. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో మరొక ఫోటో పోస్ట్ చేసింది కియారా. ఆ ఫోటోలో తాను మార్నింగ్ పర్సన్ అని చెప్పుకొచ్చింది. పొద్దున్నే లేవగానే వర్కౌట్ చేయడమే తన పని తెలియజేసింది.


కేవలం కియారా అద్వానీ మాత్రమే కాదు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహస వీరుడు సాగర కన్య సినిమా లో సాగరకన్య పాత్రలో నటించిన శిల్పా శెట్టి కూడా ఆరోగ్యకరమైన పోషకాహార పదార్థాలను తింటూ తన ఆరోగ్యాన్ని పెంచుకుంటుంది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తాను ఓట్స్ చిల్లీస్, పుదీనా చట్నీ, డ్రై ఫ్రూట్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటున్నానని తెలియజేసింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన శిల్పాశెట్టి ఇప్పటికీ పాతికేళ్ల యువతి లాగానే కనిపించడానికి కారణం ఆమె యోగాసనాలు వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయడమేనని ఆమె అనేక సందర్భాల్లో తెలిపింది.


శిల్పా శెట్టి కొత్త వంటకాలు ఎలా చేయాలో వివరంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో చెబుతుంది. అలాగే తను యోగాసనాలు చేస్తున్న వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. ఈ యోగాసనం వేస్తే ఈ ఆరోగ్యకరమైన లాభాలు చేకూరుతాయని ఆమె వివరంగా తన పోస్టులో పేర్కొంటూ తన అభిమానులకు ఫిట్నెస్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తుంది. ఏదేమైనా ఇద్దరు ముద్దుగుమ్మలు తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అనేకమైన ఆరోగ్యకర సూత్రాలను షేర్ చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: