మధ్యప్రదేశ్ గొప్ప సంస్కృతి, వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అనేక చారిత్రక ప్రదేశాలు, స్మారక చిహ్నాలు, మతపరమైన ప్రదేశాలు, మ్యూజియంలు ఉన్నాయి. ఈ నగరం పర్యాటకులను, ముఖ్యంగా శిల్పకళను ఇష్టపడే వారిని బాగా ఆకర్షిస్తుంది. సాంచి స్థూపం భారతదేశంలోని పురాతన బౌద్ధ స్మారక కట్టడాలలో ఒకటి. ఈ రాతి నిర్మాణం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కూడా. మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపాన్ని సందర్శించాలనుకునే వారి కోసం దాని గురించి కొంత ముఖ్యమైన సమాచారం.

సాంచీ స్తూపం
ఇది భోపాల్ నుండి 46 కి.మీ దూరంలో ఉంది. భోపాల్ సందర్శించినప్పుడు దీనిని తప్పక చూడాలి. సాంచి స్థూపం మధ్యప్రదేశ్‌లోని రైసన్‌లో ఉంది, దీనిని అశోక చక్రవర్తి నిర్మించారు. అతను మౌర్య రాజవంశం మూడవ చక్రవర్తి. దీనిని క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం, క్రీ.శ 12 వ శతాబ్దం మధ్య మౌర్య శకంలో నిర్మించారు. జనరల్ టేలర్ అనే బ్రిటిష్ అధికారి 1818 లో సాంచి స్థూపాన్ని కనుగొన్నారు. ఈ ప్రదేశంలో బౌద్ధులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడకు వస్తారు. ఈ స్తూపం మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఎక్కువగా సందర్శించే వాటిలో ఒకటి. భోపాల్ నుండి ఒక గంట దూరంలో ఉంది.

అక్కడికి వెళ్ళాక లోపల ఒక గైడ్‌ను ఎంచుకోవాలి. మొత్తం ఆ ప్రదేశం గురించి తెలుసుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుంది. సాంచి స్థూపం మధ్యలో ఉంది. ఈ గోపురం ఆకారంలో ఉన్న స్మారక చిహ్నం 120 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు ఉంటుంది.

స్తూపం లోనికి ప్రవేశించడానికి టికెట్ కొనాలి. టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా క్యాంపస్ వెలుపల టికెట్ కౌంటర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ టికెట్ భారతీయులకు రూ. 40, విదేశీ ప్రయాణీకులకు రూ. 600. 15 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం.

ఎలా చేరుకోవాలి
ఇక్కడికి చేరుకోవడం చాలా సులభం. ఈ ప్రాంతానికి సమీప విమానాశ్రయం భోపాల్‌లో ఉంది. విమానాశ్రయం వెలుపల నుండి అనేక ప్రీపెయిడ్ టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఒక రౌండ్ ట్రిప్ కోసం రూ.2000 వసూలు చేస్తాయి. రైలులో ప్రయాణించే వారికి భోపాల్, విదిషా రైల్వే స్టేషన్‌లు సమీపంలో ఉన్నాయి. సాంచీ విదిశ నుండి కేవలం 15 నిమిషాల దూరంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: