సంవత్సరంలో ఏడాదికి ఒకసారి జరిగే దసరా సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకుంటారు హిందువులు. అక్టోబర్, నవంబర్ వచ్చిందంటే భారతీయ సంస్కృతి, సంప్రదాయంలోని విభిన్న రంగులను అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలు. దేశంలోని అనేక ప్రాంతాల్లో దుర్గా పూజ, విజయదశమి అని పిలువబడే దసరా ప్రధాన భారతీయ పండుగలలో ఒకటి. ఈ అందమైన పండుగను జరుపుకోవడానికి ఇండియాలో ప్రతి రాష్ట్రానికి దాని స్వంత మార్గం ఉంది. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పండగను సెలబ్రేట్ చేసుకుంటారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ నుండి కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ వరకు భారతదేశంలో దసరా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఉత్తర ప్రదేశ్ లో రావణ దహనం
ఉత్తర ప్రదేశ్ లో దసరా వేడుకలలో  రావణ దహనం ఒక ముఖ్యమైన భాగం. రాష్ట్రంలో చాలా చోట్ల రావణుడి విగ్రహం దహనం చేస్తారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. వేడుకలను ఆస్వాదించడానికి ఉత్తమ ప్రదేశాలు వారణాసి, లక్నో, కాన్పూర్.

మైసూర్ లో దసరా సంబరాలు
మైసూర్ దసరా పండుగను వీక్షించడం జీవితకాల అనుభవంగా పిలుస్తారు. మైసూర్ లో దసరా పండుగ సాంస్కృతిక ప్రదర్శనలు, కవాతులు, పోటీలతో కూడిన పండుగ. ఈ సమయంలో ప్రసిద్ధ మైసూర్ ప్యాలెస్‌ను దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు.

హిమాచల్ ప్రదేశ్, కులులో దసరా
హిమాచల్ లోని కులు అనే గొప్ప కొండ పట్టణం దసరా వేడుకల విషయానికి వస్తే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పండుగను ఎంతో ఉత్సాహంతో ఒక ప్రత్యేకమైన రీతిలో జరుపుకుంటారు. ఇక్కడ ఉత్సవాలు ఏడు రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ ప్రజలు రఘునాథ్ దేవుడిని ఆరాధిస్తారు.

కోటా దసరా ఫెయిర్, రాజస్థాన్
కోటా దసరా జాతర చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మేళాలో ప్రముఖ హస్తకళాకారులు, సాంస్కృతిక కళాకారులు పాల్గొంటారు. పండుగ ముగింపు సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రాముడిని ఆరాధిస్తారు. రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. చంబల్ నది ఒడ్డున ఘనంగా జాతర జరుగుతుంది.

గుజరాత్‌లోని గర్బా
గుజరాత్ దసరా, నవరాత్రి సమయంలో చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రధాన దృష్టి అందమైన గర్బా జానపద నృత్యం. పండుగ ప్రధాన లక్ష్యం ప్రజలను ఒకే చోటుకి తీసుకురావడం, అందమైన సాంప్రదాయ దుస్తులు ధరించిన బహుళ వర్ణ చెక్క కర్రలతో నృత్యం చేయడం.

దసరా కార్నివాల్, మడికేరి, కర్ణాటక
మడికేరిలో దసరా పండుగ ఘనంగా జరుగుతుంది. ఈ పండుగ ఈ ప్రాంతంలో హాలెరి రాజుల ఆధిపత్య చరిత్ర గురించి చెబుతుంది. ఈ పండుగను మరియమ్మ పండుగ అని కూడా అంటారు . ప్రజలు జానపద నృత్యాలు చేస్తారు. భారతదేశంలో దసరా వేడుకలను జరుపుకోవడానికి ఇది అత్యంత ప్రత్యేకమైన మార్గాలలో ఒకటి.

ఢిల్లీ రామలీలా
భారతదేశంలో దసరా వేడుకల విషయానికి వస్తే ఢిల్లీ నిస్సందేహంగా సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. ఈ సమయంలో నగరం మొత్తం వధువులా అలంకరించబడుతుంది. కానీ దసరా సమయంలో ఢిల్లీలో చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే పాత ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రసిద్ధ రామలీలాను చూడటం. విజయదశమి రోజున నాటక ప్రదర్శనలు జరుగుతాయి. శ్రీరాముడి కథ, అతను రావణుడిని ఎలా జయించాడో వివరిస్తారు. అత్యంత ప్రజాదరణ పొందిన రామ్‌లీలను చూడటానికి పాత ఢిల్లీలో ఉన్న రామ్‌లీలా మైదానాన్ని సందర్శించవచ్చు.

బస్తర్ దసరా, ఛత్తీస్‌గఢ్
బస్తర్ దసరా ఒక ప్రత్యేకమైన అనుభవం. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల ద్వారా జరుపుకునే ఈ పండుగ 75 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సంప్రదాయాన్ని 13వ శతాబ్దంలో బస్తర్ రాజు పురుషోత్తం దేవ్ బడే దొంగర్‌లో ప్రారంభించినట్లు చెబుతారు. ఈ 75 రోజులలో పాత జాతర, కచన గాడి మరియు నిషా జాతర వంటి అనేక ఆచారాలు జరుగుతాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: