తెలంగాణలోని ప్రసిద్ధ ప్రదేశాలలో మహబూబ్ నగర్ ఒకటి. ఇది మతపరమైన, చారిత్రక దృక్కోణం నుండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. మహబూబ్ నగర్ చుట్టూ అనేక పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు. మహబూబ్ నగర్ లో మీరు మల్లెల తీర్థం జలపాతం, శ్రీ రంగనాయక స్వామి దేవాలయం, మయూరి నర్సరీ మొదలైన వాటిని సందర్శించవచ్చు.
రంగారెడ్డిలోని నిర్మలమైన సరస్సులు, అద్భుత దేవాలయాలు, అందమైన కొండలు పర్యాటకులను పిచ్చెక్కిస్తాయి. ఈ ప్రదేశం దక్షిణ భారతదేశంలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా చెప్పుకుంటారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే ఇది బెస్ట్ ఆప్షన్.
ఆదిలాబాద్ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా పేరు పొందింది. తెలంగాణ రాష్ట్రంలోని ఎత్తైన జలపాతం (45 మీ) ఇక్కడే ఉంది. ఇక్కడ పర్యాటకులు కుంటాల జలపాతం, కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం, మహాత్మా గాంధీ పార్క్, కళా ఆశ్రమం సందర్శించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయమైన నగరం. హైదరాబాద్ భారతదేశంలో ఐదవ అతి పెద్ద నగరం. ప్రతి ఒక్కరూ సందర్శించడానికి హైదరాబాద్ ఉత్తమమైన ప్రదేశం. ఇక్కడ మీరు చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, చౌమ హల్లా ప్యాలెస్, ఆనంద్ బుద్ధ విహార్, బిర్లా మందిర్ మొదలైన వాటిని చూసి ఆనందించవచ్చు.
తెలంగాణలో చూడదగ్గ ప్రదేశాల్లో చేరిన వరంగల్ అంటే అందరికీ ఇష్టమే. ఇది ఒక ఆకర్షణీయమైన, చారిత్రక ప్రదేశం. వరంగల్లో అనేక కోటలు,దేవాలయాలతో పాటు, అందమైన పర్వతాలు మొదలైనవి కూడా ఉన్నాయి. వరంగల్ ఈ రోజుల్లో సందర్శించడానికి ప్రత్యేకమైన ప్రదేశంగా మరింత రద్దీగా మారుతోంది.