ప్రతి ఒక్కరు లక్ష్మి దేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంట్లో పెద్దలు కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎల్లవేళల సుఖసంతోషాలతో ఉండాలని దేవతలను కోరుకుంటూ ఉంటారు.. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమంది దేవుళ్ళకు మొక్కినా, ఒక్కొక్కసారి డబ్బు తిండి కూడా కరువు అవుతుంది.. అయితే ఇప్పుడు చెప్పే కొన్ని వాస్తు చిట్కాలను అనుసరించండి వల్ల ఎటువంటి సమస్య నుండి అయినా మీరు ఉపశమనం పొందవచ్చు.. అంతేకాదు ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు , ఐశ్వర్యం, ఆహారధాన్యాలు , సంపద ఇలా ప్రతి ఒక్కటి పెరుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చూసి తెలుసుకుందాం.


తులసి మొక్కలు మీ ఇంటికి ఉత్తర దిక్కున నాటాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తిని తీసుకురావడమే కాకుండా శ్రేయస్సు తో పాటు ఆనందాన్ని కూడా చేస్తుందని నమ్ముతారు. ఇక ఇంట్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట.

ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే ఒక కుండలో నీటిని నింపి ఇంటికి ఉత్తరం వైపున ఉంచడం వల్ల డబ్బుకు లోటు ఉండదు అని నమ్ముతారు.

ఇంట్లో క్రిస్టల్ బాల్స్ ఉండడం వల్ల శుభప్రదంగా పరిగణించడం తోపాటు వాస్తు ప్రకారం కూడా మంచి జరుగుతుందట. ఇక వీటిని తలుపుకు లేదా కిటికీ పెట్టడం వల్ల సంపద పెరుగుతుందట.

ఇంట్లో లోహపు తో తయారుచేసిన తాబేలును ఉంచడం వల్ల  డబ్బుకు, ధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదట..


ఏనుగు విగ్రహాలను కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని పూర్వీకులు చెబుతున్నారు.

అంతేకాకుండా వాస్తు ప్రకారం ఒక జంట హంసల విగ్రహాన్ని ఉంచడం వల్ల అది ఇంటి అభివృద్ధికి సంకేతం అట. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, ప్రేమ పెరగడంతో పాటు ఆర్థిక శ్రేయస్సు కూడా కలుగుతుంది అని నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: