1).కాలిన చోట మంట రాకుండా ఉండాలి అంటే చర్మంపై మంచుముక్క తో రుద్దడం మంచిది. ఇది చికాకు నుండి కూడా బయటపడేలా చేస్తుంది. ఇలా మంచు ముక్క తో రుద్దడం వల్ల చర్మంపై కాలిన భాగాన చల్లబడుతుంది.
2). అయితే మరొకటి ఏమిటంటే.. కాలిన చోట టూత్ పేస్ట్ రాయడం వల్ల కాస్త చల్లబరుస్తుంది.. కానీ టూత్ పేస్ట్ చర్మ రంధ్రాలను నిరోధిస్తుంది. దీనివల్ల మంట తొందరగా తగ్గదు.
3). ఒకవేళ కాలిన తర్వాత చర్మంపై బొబ్బలు లేదా పొక్కులు వచ్చినట్లయితే. ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని పగులగొట్టకుండా కేవలం డ్రెస్సింగ్ చేయడం మంచిదని వైద్యులు తెలియజేస్తున్నారు.
4). కాలిన చోట సూర్యరశ్మి కిరణాలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఇలా చేసినట్లయితే సూర్యుని నుండి వెలువడే కొన్ని హానికరమైన కిరణాల వల్ల కాలిన చోట కాస్త చికాకుగా అనిపిస్తుంది. దీనివల్ల చర్మంపై పొక్కులు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుచేతనే ఎండలోకి వెళ్ళేటప్పుడు చర్మాన్ని కవర్ చేసుకునే విధంగా ఏదో ఒకటి తీసుకువెళ్లాలి.
ఒకవేళ అతిగా చర్మం కాలితే వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది.