దేశీయ దిగ్గజం బ్యాంక్ అయినటువంటి ఎస్ బి ఐ కస్టమర్లకు అలాగే ప్రజలకు ఎప్పటికీ రకరకాల పథకాలతో అందుబాటులోనే ఉంటుంది అన్న విషయం తెలిసింది.. ఈ నేపద్యంలోనే ప్రజలకు, తమ కస్టమర్లకు సరికొత్త పథకాలతో అందుబాటులోకి వస్తోంది. ఇకపోతే తాజాగా ప్రతి ఒక్కరికి ఒక అత్యంత శుభ కరమైన తీపి వార్తను తీసుకొచ్చింది.. ఎవరైనా సరే ఖరీదైన ఇంటిని లేదా ప్రాపర్టీని లేదా స్థలాలను కొనుగోలు చేయాలని చూస్తున్నారో అలాంటి వాళ్ళు బయట మార్కెట్లో.. ధరలు ఎక్కువగా ఉండడంతో వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు..


అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఎస్బిఐ అక్టోబర్ 25వ తేదీన ఈ - వేలం పాట నిర్వహించబోతోంది. ఈ- వేలం పాటలో అతి తక్కువ ధర కి ఇల్లు, స్థలం ,ప్రాపర్టీ వంటి వాటిని కొనుగోలు చేసే అవకాశం కూడా మనకు కల్పించబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎస్బిఐ బ్యాంక్ 25వ తేదీన ఈ- వేలం నిర్వహించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందులో మీరు కూడా పాల్గొని మీకు నచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేయవచ్చు. మార్కెట్లో లభించే రేటు కన్నా తక్కువ ధర కి మీరు ఇక్కడ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీ లకు సంబంధించిన ఈ - వేలం నిర్వహించబోతోంది ఎస్బిఐ.



ఒకవేళ మీరు ప్రాపర్టీ, ఇల్లు, షాపు, స్థలం కొనాలని భావిస్తూ ఉంటే అలాంటి వారికి ఇది ఒక చక్కటి  సదవకాశం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఎస్బిఐ లోన్ ద్వారా కారు కొనాలనుకునే వారికి కూడా మంచి ఆఫర్లను ప్రకటించింది ఎస్బిఐ బ్యాంకు.. ఇక టాటా ఆల్ట్రోజ్ కారు కొనుగోలు చేస్తున్నట్లు అయితే మూడువేల రూపాయల వరకు అదనపు తగ్గింపు అందించడంతో పాటు వడ్డీ రేటులో కూడా 0.5 శాతం డిస్కౌంట్ కూడా లభిస్తోంది.. అంతేకాదు జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా ఉండనున్నాయి.. ఇక మీరు లోన్ కి అప్లై చేయాలి అనుకుంటే, మీ మొబైల్ ద్వారా ఎస్బిఐ యోనో యాప్ డౌన్లోడ్ చేసి దాని ద్వారా లోన్ కోసం అప్లై చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: