ఎల్ఐసి ద్వారా కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉండడానికి ప్రధానమంత్రి వయో వందన యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక దీంతో సీనియర్ సిటిజన్స్ చాలామంది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ స్కీంను పొందడంలో విఫలం అవుతున్నారు. ఇక ప్రధానమంత్రి వయో వందన యోజన పథకం అనేది ఒక సామాజిక భద్రత కల్పించే పథకం. ఇందులో నెల నెల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలు కావడం గమనార్హం. ముఖ్యంగా ఈ పథకంలో చేరడానికి భార్యాభర్తలిద్దరికీ కూడా 60 సంవత్సరాల వయసు దాటి ఉండాలి.

గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో భార్యాభర్తలిద్దరూ కలిపి రూ. 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఇన్వెస్ట్మెంట్ పై మీకు 7.40% వడ్డీ కూడా లభిస్తుంది.  ఇక సంవత్సరానికి మీకు రూ.30 లక్షలకు గాను రూ.2,22,000 వడ్డీ లభిస్తుంది.. అంటే ఈ మొత్తాన్ని మీరు నెలకు రూ.18,500 ను  పెన్షన్ రూపంలో పొందవచ్చు.  ఇకపోతే ఈ స్కీమ్లో భార్యాభర్తల్లో ఒక్కరే చేరినా రూ. 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సంవత్సరానికి రూ.1,11,000 పొందుతారు అంటే నెలకు లబ్ధిదారుడు ఈ వడ్డీని రూ.9,250 పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీం యొక్క కాలపరిమితి 10 సంవత్సరాలు 2023 మార్చి 31 ఇందులో చేరడానికి చివరి రోజు.


ఒకవేళ ప్రమాదవశాత్తు 10 సంవత్సరాలలోపు లబ్ధిదారుడు మరణిస్తే ఈ స్కీమ్లో పెట్టిన  పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు. ఇక పథకంలో గడువు ఉన్నంత వరకు పెట్టుబడి పెడితే పెన్షన్ తో పాటు మొత్తాన్ని కూడా కలిపి ఇస్తారు. 2017లో జూలైలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రధానమంత్రి వయో వందన యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎల్ఐసి అందిస్తున్న ఈ ప్లాన్ వృద్ధులకు మరింత ఆర్థిక భరోసా ఇస్తుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: