ఇక ఈ క్రమంలోనే ప్రముఖ మరొక ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఇక రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్లతో పాటు స్మార్ట్ మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ లతోపాటు దుస్తులు, గృహోపకరణాలపై కూడా కళ్ళు చెదిరే డిస్కౌంట్ లను ప్రకటించాయి . ఇక ఫ్లిప్ కార్ట్ లాగే జియో మార్ట్ కూడా తాజాగా తమ ఫెస్టివల్ ఆఫర్ను ప్రకటించింది. ప్రస్తుతం జియో కూడా ఫెస్టివ్ రెడీ సేల్ పేరుతో ఈనెల 27వ తేదీ వరకు ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇకపోతే అన్ని కేటగిరీల ప్రోడక్ట్ లపై విస్తృత శ్రేణిలో పొదుపు ఆఫర్లు లభిస్తాయని జియో మార్ట్ వెల్లడించింది.
ప్రస్తుతం ఈ మూడు ఈ కామర్స్ దిగ్గజాలు పోటీపడి మరీ ఆఫర్లను ప్రకటిస్తుండడంతో కస్టమర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక తమకు నచ్చిన వస్తువు ఎక్కడ తక్కువ ధరకే లభిస్తుంది అని వెతకలాట కూడా మొదలుపెట్టారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న సేల్ ను ఉపయోగించుకొని మీరు కూడా మీకు నచ్చిన వస్తువును తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా కేవలం సెప్టెంబర్ 30 తేదీ వరకు ఆఫర్ ఉండబోతోంది. కాబట్టి ఆలోపు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తక్కువ ధరకే విలువైన వస్తువులను సొంతం చేసుకోవచ్చు.