కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం తాజా బడ్జెట్లో అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చింది. సామాన్య ప్రజలను, వారి ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోని మీరు ప్రతి నెల పెన్షన్ పొందాలని ఆలోచిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా కేంద్రం తీసుకున్న బడ్జెట్ 2023 నిర్ణయాలలో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ పెంపు చేయడం కూడా ఒకటి అందుకే ఈ పథకంలో చేరిన వారికి ఇకపై అధిక మొత్తాన్ని పొందే వెసులుబాటు కూడా కల్పించింది.

మొన్నటి వరకు రూ.15 లక్షల వరకు మాత్రమే డబ్బు దాచుకునే వెసలుబాటు ఉండేది.  కానీ ఇప్పుడు రూ. 30 లక్షలకు చేరుకుంది. సీనియర్ సిటిజన్స్ ఈ పథకంలో రూ.30 లక్షల వరకు డబ్బు పొదుపు చేసుకోవచ్చు. కాబట్టి ఇలా డబ్బు పొదుపు చేయడం వల్ల మీకు వడ్డీ కూడా ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం పై వడ్డీ రేటు 8% గా ఉండగా ఇది ఎక్కువే అని చెప్పుకోవచ్చు.  ముఖ్యంగా ఈ పథకంలోనే ఎక్కువ వడ్డీ లభిస్తుంది కాబట్టి నిజంగా ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి రాబడి పొందవచ్చు.

ఇకపోతే ఈ పథకం యొక్క మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు కాబట్టి మెచ్యూరిటీ కాలం దాటిన తర్వాత మీరు మరో మూడు సంవత్సరాలు పథకాన్ని పొడిగించుకోవచ్చు 8% వడ్డీ లభిస్తున్న నేపథ్యంలో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలవారి వడ్డీ ఎంత వస్తుంది . అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పథకం మీరు రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.20,000 ప్రతినెల వడ్డీ రూపంలో పొందవచ్చు. 3 నెలలకు రూ.60,000 అదే ఏడాదికి రెండు లక్షల 40 వేల రూపాయలు పొందుతారు అంటే సుమారుగా రూ. 12 లక్షలకు పైగా ఆదాయం పథకం ముగిసేలోపు  పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేసి అధిక లాభాన్ని పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: