సూర్య హీరోగా నటించిన చిత్రాలు ఇప్పుడు అటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, ఇటు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఏక కాలంలో రిలీజ్ అవుతున్నాయి. తెలుగులోనూ సూర్యకి మంచి మార్కెట్ ఉండటంతో తన మూవీలకి సంబంధించిన బిజినెస్ ని తెలుగులోనూ టార్గెట్ చేస్తున్నాడు. అందుకే గత కొంత కాలంగా సూర్య నటించిన చిత్రాలు అన్నీ అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ ఆడియో ఫంక్షన్స్ ని, సక్సెస్ మీట్ లని జరుపుకుంటున్నాయి.


ఇదిలా ఉంటే, తన వద్దకు వస్తున్న దర్శకులకి సూర్య కొత్త రూల్స్ ని పెడుతున్నాడు. తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్, సూర్యకి కథని వినిపించాడంట. ఆ కథలో కోలీవుడ్ నేటివిటికి తగ్గట్టుగా కథలో ట్రాజెడీ ఉంది. ఇందుకు సూర్య ఏ మాత్రం ఒప్పుకోలేదు. తెలుగు ప్రేక్షకులను సైతం మదిలో పెట్టుకొని కథని రాయాలని, కథని మళ్ళీ రీడిజైనింగ్ చేయాల్సిందిగా కోరాడంట.


ఇందుకు ఆ టాప్ డైరెక్టర్ షాక్ అయ్యాడు. ఇది ఈ ఒక్క డైరెక్టర్ విషయంలోనే కాదు, పలువురు కోలీవుడ్ దర్శకులకి సైతం సూర్య ఈ విధంగానే కథలను రెడీ చేయమంటున్నాడంట. దీంతో కోలీవుడ్ డైరెక్టర్స్ కి తెలుగు ప్రేక్షకుల నాడి పట్టుకోవటం చాలా కష్టం అని చేతులు ఎత్తేస్తున్నారు. సూర్య చెబుతున్న మార్పులకి అనుగుణంగా కథలను రెడీ చేయటం ఇప్పుడు కోలీవుడ్ దర్శకులకి కత్తిమీదసాము అన్నట్టుగా తయారయింది.


ప్రస్తుతం సూర్య నటిస్తున్న 24 మూవీ వివరాలను చూస్తే, ఈ సినిమా మే 6న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. రెహమాన్ అందించిన సంగీతం కూడా ఇప్పటికే పాపులర్ అయిపోయింది.



మరింత సమాచారం తెలుసుకోండి: