ఛార్మీ పూరి జగన్నాథ్ ల మధ్య వ్యవహారం హాట్ హాట్ గా ట్విస్టులు తీసుకుంటున్న నేపధ్యంలో ఈ ట్విస్టుల మధ్య పూరిజగన్నాథ్ కొడుకు ఆకాష్ హాట్ టాపిక్ గా మారడం నిన్న మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఆసక్తికరమైన ఈ న్యూస్ విపరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ ట్విస్టులు నిన్న జరిగాయి. ఛార్మీ పూరీల కాంబినేషన్ లో గత సంవత్సరం భారీ అంచనాలతో ‘జ్యోతిలక్ష్మి’ వచ్చిన విషయం తెలిసిందే. 

ఈసినిమాలో బూతులతో పాటు కొంత మెసేజ్ ఉన్నా అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. దీనితో ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకుని ఛార్మీ నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహరించినా ఆమెకు ఏదీ కలిసి రాలేదు. అయితే సినిమా విజయం సంగతి ఎలా వున్నా ఆ సినిమా రీత్యా ఛార్మీకి అభినందన సభలు సన్మానాలు చాల జరిగాయి. అయితే ఈ విషయాలు అన్నీ జనం పూర్తిగా మరిచిపోయినా ఛార్మీ మాత్రo మరిచి పోవడం లేదు. 

‘జ్యోతి లక్ష్మి’ సినిమా పై ఇప్పుడు ఏకంగా ఒక పుస్తకాన్ని ముద్రించారు. ఓ రచయిత్రి వివిధ కోణాల్లో ఆ సినిమాను విశ్లేషించి, వివిధ అంశాలను క్రోడీకరించి ఒక మాంచి పుస్తకంగా తయారుచేసి నిన్న ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తనికెళ్ళ భరణి లాంటి ఎందరో సినీ రచయితలు ప్రముఖులు ఆ ఫంక్షన్ లో పాల్గొన్నారు. అయితే ఈ ఫంక్షన్ కు పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ అతిధిగా రావడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 20 సంవత్సరాలు కూడ లేని ఆకాష్ పుస్తకావిష్కరణ సభకు అతిధిగా రావడం ఏమిటి అని సెటైర్లు పడ్డాయి. 

పూరీజగన్నాథ్ అతిధిగా వస్తాడు అనుకుంటే అతడి బదులు ఆకాష్ ఈ ఫంక్షన్ కు వచ్చాడు. అయితే ఈ పుస్తకానికి ముందు మాటను పూరీ వ్రాయడమే కాకుండా ఛార్మీని ఆకాశంలోకి ఎత్తేశాడు. దీనితో ఛార్మీ పూరీల సాన్నిహిత్యం కుటుంబ బంధంగా మారిందా ? అంటూ ఆ కార్యక్రమానికి వచ్చిన కొందరు కామెంట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి రానున్న రోజులలో వీరి అనుబంధం ఇంకా ఎన్ని ట్విస్టులు తీసుకుంటుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: