సినిమాలకు దూరమైన వాణిశ్రీ 13 సంవత్సరాల గ్యాప్ తరువాత తిరిగి బుల్లితెర ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న ‘ప్రేమనగర్’ సీరియల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. అత్యంత భారీ అంచనాలాతో ప్రారంభం కాబోతున్న ఈ డైలీ సీరియల్ ను అన్నపూర్ణ సంస్థ నిర్మించడం సంచలనగా మారింది. అక్కినేని నాగేశ్వరావు వాణిశ్రీల సూపర్ డూపర్ హిట్ మూవీ ‘ప్రేమనగర్’ టైటిల్ ను ఈ సీరియాల్ కు పెట్టడంతో ఈ సీరియల్ ప్రారంభం కాకుండానే అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సీరియల్ ను ప్రమోట్ చేస్తూ ఈ సీరియల్ తెర వెనుక విషయాలు నడిపించిన నాగార్జున ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సీరియల్ పై అదేవిధంగా వాణిశ్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. సినిమా పరిశ్రమలో ఒక్క టాప్ ఫ్యామిలీలకు తప్పించి మిగతా వారికి కెరియర్ కు సంబంధించి ఎటువంటి గ్యారెంటీ ఉండదనీ అదే బుల్లితెర రంగం అయితే ప్రతి వ్యక్తికి నిరంతరం ఉపాది దొరుకుతుందని అంటూ రానున్న రోజులలో ఈ డైలీ సీరియల్స్ హవా మరింత పెరిగి మరింత మందికి అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది అన్న అభిప్రాయం వ్యక్త పరిచాడు. 

ఇదే సందర్భంలో ఈ సీరియల్ లో నటించిన వాణిశ్రీ గురించి మాట్లాడుతూ ఆమె చాల గొప్పనటి మాత్రమే కాకుండా విపరీతమైన ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి అని చెపుతూ వాణిశ్రీ లాంటి ముక్కుసూటి వ్యక్తిత్వం గల నటిని తాను చూడలేదు అంటూ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తనతో చాలాసార్లు చెప్పిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. తనను చినబాబు అంటూ ఆప్యాయంగా పిలిచే వాణిశ్రీతో ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నటించడమే కాకుండా ఆమెతో కలిసి స్టెప్స్ వేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

‘ప్రేమనగర్’ మూవీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ గా కొనసాగుతున్న పరిస్థుతులలో ఆ టైటిల్ ను తమ సంస్థ నిర్మించే సీరియల్ కు పెట్టడంతో ఈ సీరియల్ రిజల్ట్ గురించి తన ‘మన్మధుడు 2’ మూవీ రిజల్ట్ కంటే ఎక్కువ టెన్షన్ పడుతున్న విషయాన్ని వివరించాడు. ఈ సీరియల్ కు సంబంధించి కేవలము తాను సలహాలు మాత్రమే ఇచ్చినా అన్ని పనులు తానే నడిపించిన తన మేనకోడలు సుప్రియ సహకారం లేకపోతే ఈ సీరియల్ లేదు అంటూ తన సినిమాలతో సమానంగా తన సీరియల్ ను ప్రమోట్ చేసుకుంటున్నాడు నాగార్జున..  



మరింత సమాచారం తెలుసుకోండి: