బుల్లితెర మీద యాంకర్స్ అంటే ఠక్కున అందరికి గుర్తొచ్చేది సుమ.. ఝూన్సీ.. అనసూయ.. రష్మీ.. శ్రీముఖి.. లాస్య. ఇలా వరుసగా ఫీ మేల్ యాంకర్సే లిస్ట్ లో ఉన్నారు. కానీ.. మేల్ యాంకర్స్ అంటే మాత్రం అందరి నోట వచ్చే పేర్లలో ఫస్ట్ పేరు ప్రదీప్. చూసేందుకు చిన్నగానే ఉన్నా.. తన టైమింగ్ తో అదరగొట్టేయటమే కాదు.. తెలుగు ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. ఆర్.జే గా మొదలైన కెరీర్ ఆ తర్వాత 'గడసరి అత్త సొగసరి కోడలు' అనే లేడీస్ గేం షో తో బాగా పాపులర్ అయ్యాడు. అల్లరి చేస్తూ.. ఆడిపాడటమేకాదు.. తనదైన పంచ్ లతో వచ్చిన సెలబ్రిటీలనే కాదు.. తన తోటి కంటెస్టెంట్లను కూడా ఆట పట్టిస్తూ హడావుడి చేస్తుంటాడు.

అలాంటి ప్రదీప్ కొద్ది రోజులగా బుల్లితెర మీద కనిపించటం లేదు. ఏమయ్యాడన్నది ఇప్పుడు అర్థం కాని ప్రశ్నగా మారింది. అయితే.. తన రెమ్యునరేషన్ ను పెంచేయటం కారణంగా అతనికి అవకాశాలు లభించటం లేదన్న మాట ఒకటి ఈ మధ్య బాగా వినిపించింది. అయితే.. అలాంటి వార్తల్లో నిజం లేదని.. ప్రదీప్ ప్రాబ్లం ఏంటనేది రివీల్ చేశాడు యాంకర్ రవి. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రదీప్.. ప్రస్తుతం సాధారణ స్థితిలోకి వచ్చే దశలో ఉన్నాడని పేర్కొన్నారు. ఢీ జోడిలో ఎంట్రీ ఇచ్చిన రవి.. ప్రదీప్ లేకపోవటం గురించి.. ఆ అంశం పై సాగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేలా అసలు విషయాన్ని చెప్పేశారు. ఈ మధ్యనే (అక్టోబరు23న) తన పుట్టిన రోజును ప్రదీప్ జరుపుకున్నాడని.. ఆ సందర్భంగా యాంకర్స్ అంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నట్లు చెప్పారు. 

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ప్రదీప్.. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడని.. త్వరలోనే గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తాడని తెలిపాడు రవి. మరి.. ప్రదీప్ కు ఎదురైన ఆరోగ్య సమస్య ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే ప్రస్తుతం అందరు వైరల్ ఫీవర్ తో అనారోగ్యానికి గురి అవుతున్న సంగతి తెలిసిందే. యాంకర్ రవి క్లారిటి ఇచ్చిన తర్వాత అందరు ఇదే అనుకుంటున్నారు. త్వరగా ప్రదీప్ కోలుకొని మళ్ళీ బుల్లితెరమీద సందడి చేయడం స్టార్ట్ చేస్తే అందరి అనుమానాలకు సమాధానం దొరుకుంది. ఇక ప్రదీప్ అప్పుడప్పుడు సినిమాలలో కూడా మెరుస్తున్న సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: