ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకశైలి విభిన్నం. అందుకే ప్రతిహీరో ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు ‘రోజా’, ‘మౌనరాగం’, ‘నాయకన్’, ‘దళపతి’, ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తీసిన మణిరత్నం సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్ నుంచి నేటి యువతరంహీరోలు గౌతమ్‌కార్తీక్ వరకు రక రకాల విభిన్న చిత్రాలు చేసారు.  అయితే ఆయన తీసిన ‘కడలి’ ఘోర పరాజయం తరువాత ఈసారి బాలీవుడ్‌లో సినిమా తీస్తారని అదేవిధంగా మలయాళంలో సినిమా చేస్తారని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఈ విషయాలకి ఏమీ స్పందించకుండా మణిరత్నం ఈ గ్యాప్ లో తన కథలను తాను తయారు చేసుకుంటూ కలం గడిపాడు.  ఇది ఇలా ఉండగామణిరత్నo ఒక అద్భుతమైన కధను తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ సమాచారం. ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించనున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబుకు మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే కోరిక చాలా కాలంగా ఉంది. నిజానికి వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా రావలసి ఉంది. కొన్ని కారణాల వలన ఆ సినిమా నిర్మింపబడలేదు. మణిరత్నం  ఈ సినిమా ఆఫర్ ను మహేష్ ముందు ఉంచాడని మహేష్ సన్నిహితులు కూడా అంటున్నారు. ఎప్పటి నుంచో కోలీవుడ్ ఎంట్రీ గురించి ఆలోచిస్తున్న మహేష్ బాబు ఈ సినిమాను ప్రస్తుత పరిస్థుతులలో అంగీకరిస్తాడా లేదా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: