టాలీవుడ్ లో కొత్త వాళ్ళ హవా కొనసాగుతుంది. కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. తెలుగులో కొత్త సినిమాల సందడి బాగుంది. కొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. లాస్ట్ ఇయర్ వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. రితేష్ రానా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కీరవాణి తనయుడు శ్రీ సింహా నటించాడు. అతనితో పాటుగా సత్య, నరేష్ అగస్త్య నటించారు. 

 

డెలివరీ బోయ్ గా జాబ్ చేసే హీరో అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కుంటాడు. అయితే దాని వెనకాల ఉన్నది ఎవరు.. హీరో ని అందులో ఇరికించింది ఎవరు అన్నది సస్పెన్స్ రివీల్ చేస్తూ డైరెక్టర్ సత్తా చాటాడు. సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టలేదని తెలుస్తుంది. శ్రీ సింహా మొదటి సినిమానే అయినా తన నటనతో మెప్పించాడు. సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ లో కామెడీని మిక్స్ చేసి హిట్ కొడుతున్నారు. 

 

మత్తు వదలరా సినిమాలో కంటెంట్ కూడా బాగుంది. సినిమాను దర్శకుడు చాలా ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు. సినిమా అంతా ఒక అపార్ట్మెంట్ లో నడుస్తుంది. కాస్టింగ్ కూడా చాలా తక్కువే అని చెప్పొచ్చు. ఈ సినిమాకు కాలభైరవ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సినిమా మొత్తం ఏడు ఎనిమిది పాత్రలతో ముగించారు. సినిమా దర్శకుడు రితేష్ రానా మొదటి సినిమాతోనే తన ప్రతిభ చాటుకున్నాడు. రితేష్ రానాకు మంచి అవకాశాలు వస్తున్నాయి.. ఈ సినిమాకు సీక్వల్ ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. సీక్వల్ లో కూడా అదే స్టార్ కాస్ట్ నటిస్తారని టాక్. ప్రేక్షకులను మత్తులో దించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. మరి ఈ సీక్వల్ ఎలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: