ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరానికి గాను అత్యధికంగా సంపాదించిన సెలెబ్రిటీల జాబితాఉ విడుదల చేసింది. ఆ లిస్టులో ఇండియా నుండి ఒకే ఒక్కరు ఉండడం విశేషం. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ 2020 సంవత్సరానికి గాను అత్యధికంగా సంపాదించిన సెలెబ్రిటిల జాబితాలో 52వ స్థానంలో నిలిచాడు. యాదృచ్చికంగా అక్షయ్ కుమార్ వయస్సు కూడా 52 కావడం విశేషం.

 

ఏడాది మూడు నుండి నాలుగు సినిమాలు విడుదల చేస్తున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ హీరోలందరి కంటే ముందున్నాడు. ఖాన్ త్రయం ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే తంటాలు పడుతుంటే, అక్షయ్ కుమార్ మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. వాటిల్లో ఎక్కువ భాగం సక్సెస్ ఇ అందుకోవడం మరింత విశేషం. ఒక్క ఏడాదిలోనే 700కోట్లకి పైగా బిజినెస్ అక్షయ్ కుమార్ సినిమాల ద్వారా అయ్యిందంటే ఆ స్పీడ్ ఏంట్ఓ అర్థం చేసుకోవచ్చు.

 

బాలీవుడ్ లో ఈ తరహా స్పీడుతో సినిమాలు ఎవరూ చేయట్లేదు. ఆశ్చర్యంగా అక్షయ్ కుమార్ విల్ స్మిత్, జెన్నిఫర్ లోపెజ్ వంటి హాలీవుడ్ స్టార్లని సైతం వెనక్కి నెట్టాడు. సినిమాలే కాదు అడ్వర్టైజింగ్స్ ద్వారానూ అక్షయ్ బాగానే సంపాదిస్తున్నాడు. 20 ప్రొడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న అక్షయ్ కుమార్ వాటి ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఏడాదికి 15-20%  ఆదాయాన్ని పెంచుకుంటూ వెళ్తున్న అక్షయ్ కుమార్ ఇండియాలో టాప్ సెలెబ్రిటీగా మారిపోయాడు.

 

ఈ విషయమై అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, మొదటగా తాను సినిమాల ద్వారా పదికోట్లు సంపాదించాలనుకున్నాననీ, ఆ తర్వాత ఆ టార్గెట్ వందకోట్లకి చేరుకుందని తెలిపాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో మరో మూడు చిత్రాల దాకా ఉన్నాయి. వాటిలో రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన లక్ష్మీ బాంబ్ ఓటీటీలో రిలీజ్ అవనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ భారీ ధర చెల్లించినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: