ప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు గా మంచి క్రేజ్, పేరు ప్రఖ్యాతులతో కొనసాగుతున్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉంటారు. ముందుగా కొన్నేళ్ళ క్రితం వచ్చిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నుండి వరుసగా సినిమా అవకాశాలను అందుకున్న పవర్ స్టార్ వాటిని విజయాలుగా మలుచుకుంటూ ఎంతో గొప్ప పేరు, క్రేజ్ గడించారు. ఇక ప్రస్తుతం వకీల్ సబ్ సినిమా తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. కాగా వాటిలో ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఇక దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పిరియాడికల్ డ్రామా మూవీ ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకొంది. అతి త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట సినిమా యూనిట్. మొదట గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్, ఆ తరువాత వరుస అవకాశాలతో పాటు కెరీర్ పరంగా ఎన్నో సక్సెస్ లతో హీరోగా గొప్ప పేరు దక్కించుకున్నారు. ఇక ఇటీవల అలవైకుంఠ పురము లో సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా పుష్ప. క్రియేటివ్ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో నల్గొండలో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కానుందని అంటున్నారు.  

ముందుగా వేసవి లో రిలీజ్ చేద్దాం అని అనుకున్నప్పటికీ, సినిమాకు సంబంధించి ప్రస్తుతం సెట్ చేసుకున్న షెడ్యూల్స్ కు మరికొంత సమయం పడుతుందని భావించి, రిలీజ్ ని వచ్చే ఏడాది ద్వితీయార్ధంకు వాయిదా వేశారట. ఒక రకంగా చూస్తే అటు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి ల సినిమా రిలీజ్ సమయానికే పుష్ప కూడా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ ఇదే గనుక జరిగితే సరిగ్గా వచ్చే ఏడాది అటు పవన్, ఇటు అల్లు అర్జున్ సినిమాలు రెండూ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయో తెలియాలంటే ఆయా సినిమాల యూనిట్ ల నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: