నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆ తరువాత రాజమౌళి తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఆ తరువాత వరుసగా అవకాశాలతో దూసుకెళ్లిన ఎన్టీఆర్, అనతికాలంలోనే మంచి సక్సెస్ లతో ఎంతో గొప్ప పేరు దక్కించుకున్నారు. ఇక ఈ ముగ్గురు హీరోల కెరీర్ ని ఒకసారి పరిశీలిస్తే, వీరు ముగ్గురూ నటించిన ఏడవ సినిమాలు కొంత ప్రత్యేకత కలిగినవి అని చెప్పవచ్చు. ముందుగా ఎస్. జె. సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన పవన్ ఏడవ సినిమా ఖుషి అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకుని యువతలో పవన్ కు విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. అక్కడి నుండి పవన్ మార్కెట్ కూడా మరింతగా పెరిగింది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఏడవ సినిమాగా వచ్చిన ఒక్కడు సినిమా అప్పట్లో అతి పెద్ద సంచలన విజయాన్ని సాధించి హీరోగా మహేష్ కు ఎంతో క్రేజ్ ని మార్కెట్ ని ఏర్పరిచింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సింహాద్రి, ఆయన కెరీర్ ఏడవ సినిమాగా రిలీజ్ అయి అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు మాస్ లో ఎన్టీఆర్ కు తిరుగులేని క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ఆ తరువాత నుండి ఎన్టీఆర్ మార్కెట్ కూగా భారీగా పెరిగింది. అయితే ఈ ముగ్గురు హీరోల కెరీర్ ఏడవ సినిమాలుగా వచ్చిన ఈ సినిమాల్లో హీరోయిన్ ఒక్కరే కావడం ఇక్కడ అసలైన ముఖ్య విషయం. ఆమె మరెవరో కాదు భూమిక చావ్లా, ఆ విధంగా ఈ ముగ్గురు హీరోల కెరీర్ ని మలుపు త్రిప్పిన ఏడవ సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకున్నారు భూమిక .....!!