టాలీవుడ్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్, రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ బడా స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఇక వీరిలో ముందుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత నుండి తనకు వచ్చిన అవకాశాలను సక్సెస్ లు గా మలచుకుని అత్యద్భుతమైన క్రేజ్ ని దక్కించుకున్నారు. ఆ తరువాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్, అనంతం తన టాలెంట్ తో వరుసగా వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకత స్థానాన్నిదక్కించుకున్నారు.  

వీరిద్దరి తరువాత ఈశ్వర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్, కూడా తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలను మంచి హిట్స్ గా మలచుకుని ప్రస్తుతం టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ జర్గర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ డ్రామా మూవీ చేస్తోన్న పవన్, వాటి అనంతరం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా, ఆపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించనున్న వేరొక సినిమాని చేయనున్నారు. మరోవైపు ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ చేస్తోన్న ప్రభాస్, దాని అనంతరం వైజయంతి మూవీస్ బ్యానర్ ఫై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు.  

దాని తరువాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వేరొక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ విధంగా ఈ ఇద్దరు హీరోలు వరుసగా సినిమాలు అంగీకరిస్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం సర్కారు వారి పాట తరువాత రాజమౌళి సినిమా మాత్రమే అంగీకరించారు. అయితే రాబోయే దసరా సందర్భంగా ఈ రెండిటి తదుపరి చేయబోయే సినిమాలను కూడా అధికారికంగా ప్రకటించనున్నారట మహేష్. ఇలా అటు ప్రభాస్, ఇటు పవన్ ల బాటలోనే మహేష్ బాబు కూడా పయనించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్ .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: