టాలీవుడ్ సినిమా పరిశ్రమకు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తరువాత గోకులం లో సీత, సుస్వాగతం, తొలిప్రేమ సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకున్న పవన్, హీరోగా అత్యద్భుతమైన పేరుని దక్కించుకున్నారు. వాటి అనంతరం వచ్చిన బద్రి, ఖుషి సినిమాలు కూడా మరింత పెద్ద సక్సెస్ లు అందుకోవడంతో అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా యువతలో పవన్ విశేషమైన పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక తన కెరీర్ లో ఇప్పటివరకు 25 సినిమాల్లో నటించిన పవన్, ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ మూవీ లో హీరోగా నటిస్తున్నారు.
వాస్తవానికి రెండున్నరేళ్ల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో నటించిన పవన్, దాని అనంతరం రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇటీవల వకీల్ సాబ్ తో మళ్ళి ముఖానికి మేకప్ వేసుకున్న పవన్, వీలైనంత త్వరగా దానిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇక మరోవైపు క్రిష్ సినిమా కూడా కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ ముందు రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే మరికొద్దిరోజుల్లో ముందు వకీల్ సాబ్, ఆ తరువాత క్రిష్ సినిమా ల షూటింగ్ మొదలెట్టాలని చూస్తున్నారట పవన్. వజ్రాల దొంగగా పవన్ నటిస్తున్న ఈ సినిమాని మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ ఏ. ఎమ్. రత్నం పాన్ ఇండియా లెవెల్లో ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా,ఆకట్టుకునే కథ, కథనాలతో క్రిష్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పలు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది.


దాని ప్రకారం, అతి త్వరలో ఈ సినిమాలోని ఒక కీలమైన పాత్రని ప్రముఖ సీనియర్ నటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పోషించనున్నారని అంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆ పాత్ర తో పాటు సినిమా కథను క్రిష్, విజయశాంతికి వినిపంచారని, అవి ఎంతో నచ్చిన విజయశాంతి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఇటీవల సరిలేరు నీకెవ్వరు లో మహేష్ తో నటించి మెప్పించిన విజయశాంతి, రాబోయే రోజుల్లో పవన్ సినిమాలో కూడా తన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు ....!!

మరింత సమాచారం తెలుసుకోండి: