నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ’ఈ సినిమా అక్టోబర్ 23 సాయంత్రం 6 గంటలకు విడుదలైంది. రిలీజ్ అయిన తర్వాత కొందరి తప్పుడు రివ్యూస్ చూసి టెన్షన్ పడ్డాము. ఆ తర్వాత రెండు మంచి రివ్యూలు వచ్చాయి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ విజయం ఆగలేదు. చాలా మంచి సినిమా తీసారంటూ అంతా కన్నీరు పెట్టుకుంటున్నారు.. సినిమా చూసిన తర్వాత ఫోన్స్ చేసి ఎమోషనల్ అవుతున్నారు. తొలివారంలోనే మా సినిమాను 7 లక్షల మంది చూసారు. టికెట్కు 100 రూపాయల చొప్పున లెక్క వేసుకున్నా తొలివారంలోనే మాకు 7 కోట్లు వచ్చాయి. దర్శకుడు సందీప్ రాజ్ మాకు మంచి సినిమా ఇస్తాడనుకున్నాం కానీ గొప్ప సినిమా ఇచ్చాడు. కలర్ ఫోటో చూసిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా మంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఫోన్లు చేసి అభినందిస్తున్నారు.. బాగా సపోర్ట్ చేసారు. ముఖ్యంగా అల్లు అరవింద్ గారు, బన్నీ వాసు గారు ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేం. ఆహా ప్లాట్ ఫామ్ ఇచ్చి మా సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేసారు. నటీనటులు కూడా ప్రతీ ఒక్కరూ న్యాయం చేసారు. ఇది సమిష్టి విజయం’ అని తెలిపారు.
దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికీ మనస్పూర్థిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేనిక్కడ ఉన్నానంటే కారణంగా వాళ్లే. వాళ్లు లేకపోతే నేను లేను. కొత్త దర్శకుడికి ఇంత ప్రోత్సాహం అందిస్తున్న అందరికీ పాదాభివందనాలు. ఈ సినిమాలో నా ఫెవరేట్ కమెడియన్, స్టార్ హీరో సునీల్ గారితో పని చేసాను. ఆయన లేకపోతే కారెక్టర్ లేదు. అలాగే ఈ సినిమాలో ప్రతీ చిన్న పాత్ర కూడా కీలకమైందే. నేను చాలా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్లు మాత్రం చాలా ఓపిగ్గా భరించారు. అలాగే సాయి రాజేష్ గారు, బెన్నీ గారికి నన్ను నమ్మినందుకు కృతజ్ఞతలు. సుహాస్ను హీరో చేయాలనుకున్నాను.. చేసాను. నేను కథలో నా కళ్ళతో వీళ్లందర్నీ చూసాను.. అదే సినిమాలో చూపించాను. ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్ కానీ.. నటున్ని కానీ కళ్లు మూసుకుని ఇకపై ఏ సినిమాలో అయినా పెట్టుకోవచ్చు.. ఇది నా హామీ’ అని తెలిపారు. ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..