ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ స్థానానికి అతి దగ్గరగా ఉన్న నటుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగిన పవన్ కళ్యాణ్ తన కెరీర్లో నాలుగో సినిమాగా వచ్చిన తొలి ప్రేమతో భారీ సక్సెస్ ని అందుకుని యువతలో విశేషమైన ఆదరణను దక్కించుకున్నారు. ఆ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన నటించిన బద్రి సినిమా కూడా సక్సెస్ అందుకుని పవన్ ఇమేజ్ ను మరింత పెంచింది.
ఇక దాని అనంతరం తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కి అతిపెద్ద విజయాన్ని అందుకొన్న సినిమా ఖుషి. ఆ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ గా మరింత ఆదరణ, క్రేజ్ లభించడం జరిగింది. ఇక ఆ సినిమా రిలీజ్ తర్వాత పవన్ ఇమేజ్ పిక్స్ కు చేరడం తో ఆయన తదుపరి చేయబోయే సినిమాపై ప్రేక్షకులు అలానే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ పవర్ స్టార్ తన తదుపరి సినిమాకి తానే దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైన సినిమానే జానీ. రేణు దేశాయ్ హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని ద్వారా తొలిసారిగా దర్శకుడిగా మారిన పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా రిలీజ్ తర్వాత ఈ మూవీతో భారీ డిజాస్టర్ ను చవిచూశారు.

అయితే ఇప్పటికి కూడా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ అభిమానుల మర్చిపోలేరనే చెప్పాలి. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ సాధించనప్పటికీ కూడా సినిమాలోని కథ, కథనాలు అలానే అందులోని జానీ పాత్ర కోసం పవన్ కళ్యాణ్ పడిన శ్రమ ఆయన ఎప్పటికీ మర్చిపోలేము అని అంటుంటారు అభిమానులు. నిజానికి ఆ సమయంలో తారాస్థాయిలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ జానీ సినిమా యొక్క కథ, కథనాల విషయంలో కనుక మరికొంత జాగ్రత్త వహించి ఉంటే తప్పనిసరిగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని ఇక ఆ తర్వాత నుండి ఆయన ఇమేజ్ మరింతగా పీక్స్ కి చేరి తప్పకుండా అప్పట్లోనే ఆయన నెంబర్ వన్ హీరోగా నిలచేవారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ప్రస్తుతం రెండేళ్ల అనంతరం పవన్ కళ్యాణ్, వకీల్ సబ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: