నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను తో కలిసి ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రజ్ఞ మార్టిన్ హీరోయిన్ గా నటించబోతుందని తెలుస్తోంది. ముచ్చటగా మూడోసారి బాలయ్య - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ మూవీ షూటింగ్ అతి త్వరలోనే పున ప్రారంభం కానున్నది. గత కొద్దికాలంగా పలు సినిమాలతో డిజాస్టర్ టాక్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఈ సారి మంచి హిట్ సంపాదించాలని భావిస్తున్నారు. అందుకే తన లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో కలిసి ఓ సినిమా తెరకెక్కించడానికి ఒప్పుకున్నారు.


ప్రస్తుతం అందుతున్న నివేదికల ప్రకారం బాలకృష్ణ సినిమా లో నందమూరి తారకరత్న ఎమ్మెల్యే పాత్రలో నటించబోతున్నారట. గతంలో వీళ్ళిద్దరూ కలిసి నటించారన్న సంగతి తెలిసిందే. ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తారకరత్న 2019లో కాకతీయుడు సినిమా పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. రాజా చెయ్యి వేస్తే,  ఖయ్యూం భాయ్, రాజా మీరు కేక, ప్రాణం ఖరీదు వంటి అనేక సినిమాల్లో నటించారు కానీ ఒక్క సినిమా కూడా అతన్ని హీరోగా నిలబెట్టే లేకపోయింది.


నందమూరి హీరోల సినిమాల్లో కనీసం ప్రధాన పాత్రల్లో నటించడానికి కూడా తారకరత్న ప్రయత్నించకపోవడం బాధాకరం. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ సినిమాల్లో కీలక పాత్రలో నటించినట్లయితే తనకి మంచి నటుడిగా గుర్తింపు దక్కేది. కానీ సోలోగా ప్రయత్నాలు చేసి ఫెయిల్యూర్ గా నిలిచారు తారకరత్న. అయితే సినిమా రంగంలోనే కొనసాగాలన్న తన తపన ప్రస్తుతం అతన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని చేయబోతుంది. బాలకృష్ణ సినిమాలో మంచిగా నటిస్తే తనకు మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో తన నటనా ప్రదర్శన మంచిగా ఉంటే ఇతర హీరోల సినిమాల్లో కూడా ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: