చిరంజీవి డ్యాన్స్ కోపం తెప్పించిందట... !

ప్రేక్షకులను తన డ్యాన్స్ లతో ఉర్రూతలూగించిన నటుడు చిరంజీవి. అప్పటివరకు ఉన్న మూస తరహా డ్యాన్స్లకు నటనకు చిరు పక్కనపెట్టాడు. ఒక్కసారిగా తెలుగు తెరమీద చిరు.. బ్రేక్ డ్యాన్స్లు చేస్తుండటంతో కుర్రకారు పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత ఆయన తెలుగులో నంబర్ 1 స్టార్ హీరోగా ఎదిగాడు.



చిరంజీవి డ్యాన్స్లు ఫైట్లు అంటే ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. దీంతో ఆయనకు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే ప్రారంభంలో చిరంజీవి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హీరోగా ఎంట్రీ ఇచ్చే కంటే ముందు చిన్న చిన్న వేషాలు విలన్ పాత్రల్లోనూ నటించాడు. అయితే సరిగ్గా అదే సమయంలో చిరంజీవి చేసిన ఓ డ్యాన్స్ దర్శకుడికి కోపం తెప్పించదట. చిరంజీవి ఫస్ట్ సినిమా పునాది రాళ్లే అయినప్పటికీ ముందు ఆ సినిమా రిలీజ్ కాలేదు. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభించిన ప్రాణం ఖరీదు చిత్రమే ముందు థియేటర్లలోకి వచ్చింది.
సినిమాలో చిరంజీవి తోపాటు చంద్రమోహన్ జయసుధ నటించారు. ఈ సినిమాకు కే వాసు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం రాజమండ్రిలోని అప్సరా హోటల్లో బసచేశారట.

డైరెక్టర్ వాసు రెండో ఫ్లోర్లో ఉండగా.. చిరంజీవి మిగతా నటులు సిబ్బంది మొదటి ఫ్లోర్లో బసచేశారట. అయితే రాత్రి అందరూ పడుకున్న సమయంలో చిరంజీవి తన గదిలో పెద్దగా టేప్ రికార్డర్లో పెద్దగా సౌండ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసేవాడట. దీంతో నిద్రకు డిస్టర్బ్ అయి పీ వాసు చాలా సార్లు విసుక్కొనేవాడట.

అసిస్టెంట్స్ డైరెక్టర్స్ వచ్చి సార్ మన సినిమాలో నటిస్తున్న చిరంజీవి అనే కుర్రాడు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అని సర్దిచెప్పారట. అయితే ప్రాణం ఖరీదు చిత్రం 45 రోజుల పాటు చిత్రీకరించారు. ఈ సినిమా కమర్షియల్గా పెద్దగా హిట్ కాకపోయినప్పటికీ చిరంజీవికి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత చిరంజీవి తెలుగులో టాప్ హీరోగా ఎదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: