టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మొదట్లో కొన్ని విలన్ పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవుడ్ కు నటుడిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మెల్లగా ఒక్కొక్కటిగా వచ్చిన అవకాశాలని వినియోగించుకుని ఆపై నటుడిగా మంచి పేరుతో ముందుకు కొనసాగారు. ఇక ఆయన కెరీర్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా అత్యద్భుత విజయాన్ని అందుకొని మెగాస్టార్ కి అతి పెద్ద బ్రేక్ ను అందించింది. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ హీరోగా దూసుకెళ్లిన మెగాస్టార్ ఆపై ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకొని కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని తెలుగు సినిమా చరిత్రలో క్రేజీ హీరోగా గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నగ్మా హీరోయిన్ గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిక్షావోడు. 1995 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని ఇటీవల ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వర రావు ఒక మీడియా ఛానల్ వీడియో లో భాగంగా దాని గురించి ప్రస్తావించారు.

ఇక ఆ సినిమాలోని 'పాపా ఎదిరింపా బెదిరింపా' అనే సాంగ్ షూటింగ్ సమయంలో ఒక్కసారిగా అనుకోకుండా చిరంజీవి, నగ్మాల మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందని అయితే ఆ తర్వాత నగ్మా షాట్ ఆపేసి నడుస్తూ వెళుతుంటే చిరంజీవి గారు ఆగు నగ్మా ఆగు అంటూ బ్రతిమలాడసాగారని అయితే వారిద్దరి మధ్య గొడవకు కారణం ఏమిటి అసలు ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియనప్పటికీ మొత్తానికి ఏదో జరిగిందనే విషయం మాత్రం అర్థం అయిందని, అయితే చిరంజీవి మాట వినకుండా నగ్మా వెళ్లిపోవడంతో షూటింగ్ అయిపోతుంది అని అందరూ భావించారట, కానీ చిరంజీవి మాత్రం అప్పటికే అతి పెద్ద హీరోగా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఎంతో ఒదిగిపోయి నగ్మా దగ్గరికి వెళ్లి ఆ తర్వాత మెల్లగా సర్దిచెప్పి మళ్ళీ ఆమెను షూటింగ్ కి తీసుకువచ్చారని అన్నారు. మెగాస్టార్ యొక్క గొప్పతనానికి, మంచి మనసుకి ఉదాహరణగా ఈ ఒక్క చిన్న సంఘటన చాలని విశ్వేశ్వరరావు అప్పటి ఘటన గురించి చెప్పటం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: