టాలీవుడ్ టాప్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా ప్రాణం ఖరీదు సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. ఇక ఆ తరువాత నుండి మెల్లగా తన టాలెంట్ తో ఒక్కోక్కటిగా అవకాశాలు అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆపై కొన్నాళ్ల అనంతరం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఖైదీ సినిమా ద్వారా ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఆపై హీరోగా వరుస అవకాశాలతో దూసుకెళ్లిన మెగాస్టార్, అనతికాలంలోనే పలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ఎంతో గొప్ప క్రేజ్, పాపులారిటీ తో పాటు అప్పట్లో భారీ మార్కెట్ ని కూడా దక్కించుకున్నారు.

ఇక ఇప్పటికీ కూడా మెగాస్టార్ సినిమాలు చేస్తూ కొనసాగుతుండగా ఆయన యొక్క క్రేజ్, ఛరిష్మా, బాక్సాఫీస్ స్టామినా వంటివి ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోగా కొన్నేళ్ల అనంతరం రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమా ఆచార్య. ఇక మొదటి నుండి కూడా సెట్స్ లోని వారి పట్ల, అలానే సినిమా ఇండస్ట్రీ లోని వారందరి పట్ల ఎంతో సౌమ్యత తో వ్యవహరించే అలవాటు గల చిరంజీవి పై ఎందరో ప్రముఖులు గొప్పగా పొగడ్తలు కురిపిస్తూ ఉంటారు. ఇక ఎంత ఎదిగినప్పటికే కూడా వొదిగి ఉంటూ సెట్స్ లో లైట్ బాయ్ కి సైతం ఎంతో గొప్పగా విలువనిచ్చే మెగాస్టార్ మంచి మనసుకి పలువురు కితాబిచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.


ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆచార్య సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటిస్తున్న సోను సూద్ మెగాస్టార్ ని ఉద్దేశించి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. తన కెరీర్ లో తాను పని చేసిన నటుల్లో మెగాస్టార్ వంటి గొప్ప మనస్సుగల నటుడిని తాను ఎప్పుడూ చూడలేదని ఆయన కి హ్యాట్సాఫ్ చెపుతూ పోస్ట్ చేసారు సోను. అయితే దానికి రిప్లై గా మీరు ఎంతో గొప్ప మనసుతో కరోనా సమయంలో ఎందరో పేదలకు చేతికి ఎముక లేని విధంగా చేస్తున్న గొప్ప సాయం నిజంగా ఎందరికో స్ఫూర్తి అని, మీవంటి వారితో పని చేయడం తనకు కలిగిన గొప్ప అదృష్టం అని మెగాస్టార్ రీట్వీట్ చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ లు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: