టాలీవుడ్ బడా స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ప్రస్తుతం టాప్ హీరోలుగా కోట్లాదిమంది మనస్సులో గొప్ప స్థానాన్ని సంపాదించుకుని అద్భుతమైన క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇక ఈ ఇద్దరికీ దాదాపుగా అన్ని ఏరియాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు విపరీతమైన మార్కెట్ కూడా ఉంది. మొదటగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఆ తరువాత రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. పవన్, మహేష్ లు ఆ తరువాత వరుసగా మంచి సక్సెస్ లు అందుకుని కొనసాగారు.


ఇక పవన్ కు తొలిప్రేమ, బద్రి, ఖుషి సినిమాలు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టగా మహేష్ కి తొలి సినిమా రాజకుమారుడు, మురారి, ఒక్కడు సినిమాలు సూపర్ పాపులారిటీ అందించాయి. ఇకపోతే ఈ ఇద్దరూ కూడా ఇప్పటి వరకు తమ కెరీర్ లో జయాపజయాలతో నిమిత్తము లేకుండా ఎంతో గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు అనే చెప్పాలి. అయితే వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని వారి వారి అభిమానులతో పాటు ఎందరో ప్రేక్షకులు సైతం ఎప్పటి నుండో ఎంతో ఆశపడుతున్నారు. ఐతే అది మాత్రం ఇప్పటివరకు జరుగలేదు.
ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, మరొక రెండు రోజుల్లో రానున్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని పవన్ కళ్యాణ్, మరియు ఆయన సతీమణి అన్నా లెజెనోవా లు సూపర్ స్టార్ మహేష్, నమ్రత శిరోద్కర్ దంపతులకు ప్రత్యేకంగా గిఫ్ట్ లు పంపించడం జరిగింది. ప్రస్తుతం వారు పంపిన గిఫ్ట్ లు అలాగే గ్రీటింగ్స్ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా పలువురు సూపర్ స్టార్, పవర్ స్టార్ అభిమానులు వాటిని మరింతగా షేర్, లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: