మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఇంకా తిరుగులేని  క్రేజ్ తో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి సినిమా ప్రాణం ఖరీదు మొదలుకొని ప్రస్తుతం ఆయన చేస్తున్న ఆచార్య సినిమా వరకూ మెగాస్టార్ క్రేజ్ ఒక్కొక్క సినిమాతో మరింత పెరుగుతూ ఉందనే చెప్పాలి. ఒక రకంగా ఆయన తర్వాత ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో ఎవరు నెంబర్ వన్ అనేది ఇంకా జవాబు లేని ప్రశ్న గానే మిగిలిపోయింది అని చెప్పక తప్పదు. అయితే మెగాస్టార్ తర్వాత ఆయన ఫ్యామిలీ నుండి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి హీరోలందరూ ఎవరికి వారు ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తూ అటు ప్రేక్షకుల ఇటు అభిమానుల మన్ననలు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీల్లో ఒకటైన మెగాఫ్యామిలీ పై అటు అభిమానుల్లోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వారికి సంబంధించి ఈవెంట్ గాని ఏదైనా ఫంక్షన్ గాని జరిగితే చాలు దానికి ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన తారస్థాయిలో ఉంటుంది. ఇక నేడు క్రిస్మస్ పండుగని పురస్కరించుకొని వారి ఫ్యామిలీలోని హీరోలందరూ కలిసి ఒకచోట చేరి దానిని ఎంతో  వైభవంగా జరుపుకున్నారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ క్రిస్మస్ కి ప్రత్యేక పార్టీని కుటుంబ సభ్యులందరికీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందరూ దిగిన ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తుండగా పలువురు ప్రేక్షకులు అలానే అభిమానులు వారికి ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాటిని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో మరింతగా వైరల్ చేస్తున్నారు.....!!




మరింత సమాచారం తెలుసుకోండి: