27 ఏళ్ల తెలుగు ముద్దుగుమ్మ చాందినీ చౌదరి హౌరా బ్రిడ్జ్, మను, శమంతకమని, కుందనపు బొమ్మ, కేటుగాడు వంటి చిత్రాల్లో నటించారు కానీ ఆమెకు కొంచెం కూడా పాపులారిటీ రాలేదు. 2020లో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్టయిన కలర్ ఫోటో లో ఆమె హీరోయిన్ గా నటించారు. అయితే ఈ ఒక్క సినిమాతో ఆమెకు ఎన్నడూ రాని పాపులారిటీ వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఆమె నటనా ప్రతిభను మెచ్చుకున్నారు. మూవీ క్రిటిక్స్ సైతం ఆమెను ఆకాశానికెత్తారు. కలర్ ఫోటో సినిమా కి ముందు, సినిమాకు తర్వాత అన్న చందంగా ఆమె కెరీర్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఆమెకు చాలా సినీ అవకాశాలు తన్నుకొస్తున్నాయి.

అయితే చిత్రరంగంలో బ్రేక్ రావడానికి ముందు ఎవరైనా సరే కచ్చితంగా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. విజయ్ దేవరకొండ వంటి హీరోలు కూడా మొదట్లో ఎంతో కష్టపడి ఆ తర్వాత స్టార్ హీరోల అయ్యారు. చాందినీ చౌదరి కూడా తన కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బంది పడ్డారట. ముఖ్యంగా ఒక నిర్మాత కారణంగా ఆమె మూడేళ్లు చుక్కలు చూడాల్సిన పరిస్థితి వచ్చిందట. ఓ ఇంటర్వ్యూలో తాజాగా పాల్గొన్న చాందినీ తనను ఒక నిర్మాత ఆ చాలా ఇబ్బంది పెట్టారు అని ఆమె తెలిపారు. ఆ నిర్మాత తన సినిమాలో నటించినంత కాలం వేరే సినిమాల్లో నటించడానికి వీల్లేదు అని చెప్పి ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకున్నారు.

అప్పట్లో సినీ అవకాశాలు లేక.. ఒక సినిమాని వదులుకోలేక.. అగ్రిమెంట్ మీద చాందిని సంతకం పెట్టారట. అయితే ఆ సినిమా పూర్తి కావడానికి ఏకంగా మూడు సంవత్సరాలు కాలం పట్టిందట. వాయిదాల విడతలుగా సినిమా పూర్తి చేస్తున్న కాలంలో చాందిని నిర్మాతలు కలిసి ఎలాగూ సినిమా ఆలస్యంగా సేకరణ జరుపుకుంటుంది కాబట్టి తాను వేరొక సినిమాలో నటిస్తానని చెప్పారట. కానీ ఆ నిర్మాత అందుకు ఒప్పుకోలేదట. ఈ విషయంలో గొడవలు కూడా అయ్యాయట. కానీ ఆ నిర్మాత తన మాటనే నెగ్గించుకున్నారట. దీనితో చాందినీ చౌదరి చాలా కోప్పడారట కానీ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టారు కాబట్టి చేసేదేమీలేక నిర్మాత చెప్పినట్టు నడుచుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: