ఓవర్‌ నైట్‌లో ఇండియా మొత్తం తెలియాలంటే.. ముందు ఆ అమ్మాయిని చూడాలి. ఒక్క సైగతో పాపులర్‌ అయిపోయింది. ఎంతగా క్రేజ్ వచ్చిందంటే.. ఇండియాలో యూత్‌ అంతా ఆమె గురించే మాట్లాడుకున్నారు.  క్రేజ్‌ వచ్చినంత త్వరగా ఆఫర్స్‌ రాలేదు. ఇప్పుడిప్పుడే తెలుగులో సెటిల్‌ అవుతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు ప్రియా ప్రకాష్ వారియర్.  

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కన్ను గీటితే.. యూత్‌ మొత్తం ఫ్లాట్‌ అవుతారని డైరెక్టర్‌ కూడా ఊహించలేదు. మళయాళ చిత్రం 'ఒదు ఆధార్‌ లవ్‌'  సినిమాలో ఓ బిట్‌ను రిలీజ్‌ చేసేరో లేదో ఈ అమ్మడి గురించే మాట్లాడుకున్నారు. ఈ అమ్మడికి మంచి ఫ్యూచర్‌ ఉందంటూ..  జాతకం చెప్పేశారు. మూడేళ్లవుతున్నా.. క్రేజ్‌ రాలేదు కదా.. బిజీ కూడా అవ్వలేదు ప్రియా వర్‌.

'ఒదు ఆధార్‌ లవ్‌' తర్వాత ప్రియా నటించిన హిందీ మూవీ 'శ్రీదేవి బంగ్లా' వివాదస్పదమైంది. జగదేక సుందరి శ్రీదేవి బయోపిక్‌గా తీస్తున్నారంటూ.. ఆరోపించడంతో.. సినిమా రిలీజ్‌కు నోచుకోలేదు. ప్రియా వారియర్‌కు అనుకోని క్రేజ్‌ వచ్చినా.. నిలబడలేదు. కాస్తోగొప్పో తెలుగులో ఒకట్రెండు ఆఫర్స్‌ దక్కాయి. చెక్‌ మూవీలో నితిన్‌తో జత కడుతోంది. మెగా సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ రీసెంట్‌గా స్టార్ట్‌ చేసిన 'ఇష్క్‌'లో తేజ్‌ సజ్జాతో నటిస్తోంది.  

2018లో వచ్చిన మళయాళ మూవీ ఒరు ఆధార్ లవ్ లో ప్రోమో రిలీజ్ చేయడంతో.. ఓవర్ నైట్ లో ఫుల్ పాపులర్ అయిపోయింది. కుర్రకారు అయితే ఆమె కన్నుగీటిన విధానానికి ఫిదా అయిపోయారు. ఏదో తమకే అలా గీటినట్టుగా ఫీలయి మెలికలు తిరిగిపోయారు. తమ కలల రాణిగా ఊహించేసుకున్నారు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉందంటూ జోస్యం కూడా చెప్పేశారు.

కానీ ఆమెకు మూడేళ్లుగా ఆఫర్స్ అంతంత మాత్రమే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రియా వారియర్ ను టాలీవుడ్ ఆదుకుంది. చెక్ లో నితిన్ తో జోడీ కట్టిన ఈ బ్యూటీ.. ఇటీవల మొదలైన ఇష్క్ ఓబేబీ ఫేం సరసన ప్రియా వారియర్ నటించనుండటంతో కుర్రకారులో మరింత ఆసక్తి పెరుగుతోంది.











మరింత సమాచారం తెలుసుకోండి: