షార్ట్ ఫిలిమ్స్  నుండి తెలుగు తెర పైకి వచ్చిన చాందిని చౌదరి.. మొద‌ట్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో నటించిన .. ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోయింది. ఇక గత సంవత్సరం ఆహా లో  విడుద‌లైన క‌ల‌ర్ ఫొటో చిత్రం లో  చాందినీ చౌదరి అద్భుతంగా నటించి మంచి మార్కులే కొట్టేసింది .. ఇప్పుడు ఈ బ్యూటీ సూప‌ర్ ఓవ‌ర్ అనే చిత్రంలో న‌టించింది. ఇందులో హీరోగా న‌వీన్ చంద్ర  చేసారు.. ఈ సినిమా ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ ప్రెస్ మీట్‌లో మాట్లాడిన చాందినీ చౌద‌రీ భావోద్వేగానికి గురి స్టేజ్ మీదే ఏడ్చేశారు.

మూవీ షూటింగ్ క్లైమాక్స్‌లో ఉండ‌గా.. ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ యాక్సిడెంట్‌కి గురి అయ్యి క‌న్నుమూశారు. దాన్ని గుర్తు చేసుకున్న చాందినీ.. స్టేజ్ మీద ఎమోష‌న‌ల్ అయ్యారు. క్రికెట్ బెట్టింగ్ మీద ప్ర‌వీణ్ ఈ చిత్రాన్ని బాగా తీశాడు. ఇది మీకు క‌చ్చితంగా న‌చ్చుతుంది అనుకుంటున్నాము.  ఈ సందర్భంగా ఎమోషనల్ అయిన చాందిని ని  హీరో నవీన్ చంద్ర ఆమెను ఓదార్చడం విశేషం .. ఇక హీరో మాట్లాడుతూ.. మేము ఇంత ఎమోష‌న‌ల్ అవ్వ‌డానికి కార‌ణం. ప్రవీణ్ తో గడిపిన క్షణాలను అలాగే ఈ ప్రెస్ మీట్ అయన లేకోవడం ఈ రెండు మమల్ని ఎమోషనల్ గా మార్చాయి ..

కాగా ప్ర‌వీణ్ టాలీవుడ్ దర్శకుడు సుధీర్ వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్‌గా పనిచేసారు. అతడే ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సీన్‌ని వివ‌రిస్తూ ఓ యాక్సిడెంట్‌కి గురైన ప్రవీణ్..  వారం రోజుల పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  మొద‌టి సినిమా విడుద‌ల కాకాముందే మ‌ర‌ణించిన ఈ ద‌ర్శ‌కుడి హ‌ఠాణ్మ‌ర‌ణం టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది. అలాగే సినిమా లో పనిచేసిన ప్రతి ఒక్కరు  దర్శకుడితో పనిచేసిన రోజులని మరిచిపోలేకపోతున్నారు .. అందుకే హీరోయిన్ స్టేజి పైన ఏడవడం, హీరో ఓదార్చడం వంటివి జరిగాయి ..  కొన్ని రోజులు  ఒక మనిషితో జర్నీ చేసి సడెన్ గా ఆ మనిషి మరణ వార్త తెలిస్తే ఎవరికైనా బాధ కలగడం సహజం ..

మరింత సమాచారం తెలుసుకోండి: