ఒకనాటి హాట్ డాన్సర్ జ్యోతిలక్ష్మి పేరుతో టాలీవుడ్ లో నిర్మాణం జరపబోతున్న సినిమాలో ఛార్మీ నటించబోతోంది అంటూ ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా విషయమై ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చింది. . ఈ సినిమాను తాను దర్శకత్వం వహించబోతున్నట్లు పూరీ జగన్నాథ్ తెలియచేసాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం 2015లో సెట్స్ కు వెళుతుందని పూరి ప్రకటించాడు. అయితే మీడియాలో వార్తలు వస్తున్న విధంగా ఒకనాటి శృంగార తార జ్యోతిలక్ష్మి జీవితానికి ఈ సినిమాకు ఎటువంటి సంబంధంలేదని పూరి క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాను ప్రముఖ నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా సినిమా తీస్తుతున్నాని ఎప్పటి నుంచో ఈ సినిమాను తీయాలని తనకు కోరిక ఉన్నా టాప్ హీరోల సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ప్రారంభం కావడం ఆలస్యం అయింది అని అంటున్నాడు పూరి.  అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన పూర్వ నిర్మాణ కార్యక్రమాలు కూడా చాల వేగంగా జరుగుతున్నాయి అని స్పష్టం చేసాడు పూరి. ప్రస్తుతం తెలుగు సినిమా రంగానికి కధల కొరత వెంటాడుతూ ఉండటంతో పూరి మళ్ళీ యూటర్న్ తీసుకుని నవలల పై ద్రుష్టి పెట్టడంతో తిరిగి టాలీవుడ్ లో నవలను ఆధారంగా తీసుకునే సినిమాలు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి...   

మరింత సమాచారం తెలుసుకోండి: