మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలిసారిగా టాలీవుడ్ తెరకు పరిచయమైన సినిమా ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి నూతన దర్శకుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ వారు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుని ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. తొలి సినిమా అయినప్పటికీ కూడా హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా ఎంతో అద్భుతంగా నటించారని ముఖ్యంగా సినిమా యొక్క కథా కథనాలను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు బుచ్చిబాబు పూర్తిగా సఫలం అయ్యారని మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అదిరిపోయాయని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అలానే విలన్ గా నటించిన విజయ్ సేతుపతి వండర్ఫుల్ గా యాక్ట్ చేసారని ప్రశంసలు అందుతున్నాయి.

 ఇక ఈ సినిమా పై పలువురు సినిమా ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉండటం విశేషం. అలానే విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, బి, సి అని తేడా లేకుండా అన్ని సెంటర్స్ లో కూడా ఇంకా అదరగొడుతూ కొనసాగుతోంది. అయితే మంచి హృద్యమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ మూవీకి గతంలో వచ్చిన మరో ప్రేమకథ సినిమా అయిన కలర్ ఫోటో తో పలువురు పోలిక పెడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.ఉప్పెన మాదిరిగానే కలర్ ఫోటో కూడా ఎంతో ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది. అందులో హీరో క్లైమాక్స్ లో చనిపోతాడు. యువ దర్శకుడు సందీప్ రాజ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ లో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక ఇందులోని సాంగ్స్ కూడా ఆడియన్స్ ను ఎంతో అలరించాయి. అయితే ఉప్పెన బాగుంటుందా లేక కలర్ ఫోటో బాగుంటుందా అంటూ పలువురు నెటిజన్లు ఈ రెండిటి మధ్య పోలిక పెడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోల్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల నుంచి సమానమైన రెస్పాన్స్ దక్కించుకోవడమే....!!

మరింత సమాచారం తెలుసుకోండి: