ఇక ప్రస్తుతం
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య
మూవీ చేస్తున్నారు మెగాస్టార్.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మెగాపవర్ స్టార్
రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ,
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
మూవీ ఈ ఏడాది వేసవి కానుకగా మే 13న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ
మూవీ తరువాత ఇప్పటికే మరొక మూడు సినిమాలు లైన్లో పెట్టారు మెగాస్టార్.
కాగా వాటిలో ఒకటి తదుపరి తెరకెక్కనున్న లూసిఫర్ మలయాళ
మూవీ తెలుగు రీమేక్.
మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ
సినిమా యొక్క అధికారిక
పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి.
మెగాస్టార్ ఇందులో ఒక పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ఆయనకు జోడీగా మరొక్కసారి
నయనతార నటించనుంది అనేది లేటెస్ట్
టాలీవుడ్ వర్గాల టాక్.
సైరా నరసింహారెడ్డి లో సిద్దమ్మగా ఎంతో అద్భుతంగా నటించిన స్టార్
హీరోయిన్ నయనతార మరొక్కసారి
మెగాస్టార్ ప్రక్కన
హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్నది నిజమే అని త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది అని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే కొద్దిరోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.....!!